MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఢిల్లీకా.. గల్లీకా..? రాయుడు రాజకీయం ఎక్కడ్నుంచి..? వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నాకే ప్రకటన!

ఢిల్లీకా.. గల్లీకా..? రాయుడు రాజకీయం ఎక్కడ్నుంచి..? వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నాకే ప్రకటన!

Ambati Rayudu: ఇటీవలే  అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు  తన లైఫ్ లో మరో ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టనున్నాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Jun 18 2023, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీమిండియా మాజీ క్రికెటర్, సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు ఇటీవలే  అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.   త్వరలోనే అతడు అమెరికా వేదికగా జరుగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) లో పాల్గొననున్నాడు. ఇది ముగిసిన తర్వాత  రాయుడు   తన లైఫ్ లో మరో ఇంట్రెస్టింగ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

రాయుడు త్వరలోనే  ఆంధ్రా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇదివరకే మీడియాలో,  రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో దీనిపై జోరుగా చర్చ సాగుతోంది.  రాయుడు.. ఆంధ్రాలోని అధికార వైఎస్సార్‌సీపీలో చేరనున్నాడని  ప్రచారం జరుగుతోంది.  

36

ఈ మేరకు రాయుడు ఇప్పటికే  పలుమార్లు ఆంధ్రా సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కలవడం.. ట్విటర్ లో  జగన్ పై  ప్రశంసలు కురిపించే  పనిపెట్టుకోవడం  కూడా  అతడి ఎంట్రీని చెప్పకనే చెబుతున్నాయి. అయితే రాయుడు ఎంట్రీ   ఎంఎల్‌సీ తర్వాతే ఉంటుందని  తెలుస్తున్నది. రాయుడు వైఎస్సార్సీపీలో చేరడం లాంఛనమే గానీ అతడు ఎక్కడ్నుంచి పోటీ చేస్తాడనే విషయం మాత్రంపై  స్పష్టత రావడం లేదు. 

46

రాయుడుది ఆంధ్రాలోని గుంటూరు జిల్లాలోని పొన్నూరు  ప్రాంతం.  ఇదే స్థానం నుంచి  అతడు  అసెంబ్లీకి పోటీ చేయాలని  రాయుడు భావిస్తున్నాడని సమాచారం. అయితే అసెంబ్లీ కంటే  అతడిని  పార్లమెంట్ కే పంపించాలని  ఏపీ సీఎం  అనుకుంటున్నారట.  

56

గుంటూరు  లేదా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం  నుంచి గానీ రాయుడును పోటీ చేయించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది.  ఇటీవల  ఐపీఎల్ - 16 గెలిచిన తర్వాత  జగన్‌ను కలిసిన రాయుడుతో  కూడా  సీఎం దీని గురించే చర్చించినట్టు  గుసగుసలు వినిపించాయి.  

66

అయితే  వైఎస్సార్సీపీ వర్గాల సమాచారం ప్రకారం  రాయుడును  పార్లమెంట్ కే పంపాలని వైసీసీ అధినేత  నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. గుంటూరు లోక్‌సభ స్థానంలో 2018 లోక్‌సభ ఎన్నికలలో టీడీపీ (గల్లా జయదేవ్) గెలిచింది.  అయితే ఈసారి ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ.. రాయుడును గుంటూరు నుంచే పోటీ చేయించాలని ప్రణాళికలు రచిస్తోంది. కుల సమీకరణాలు కూడా రాయుడుకు అనుకూలంగా ఉన్నాయి.  రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ వీరే !
Recommended image2
IPL 2026 Playoff Race: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లొల్లి.. మూడు బెర్తులు కన్ఫర్మ్.. ఆ నాలుగో స్థానం ఎవరిది?
Recommended image3
IPL : ఈడు మామూలోడు కాదు బాబోయ్! ఇషాన్ కిషన్ ఊచకోతకు చెన్నై ఖేల్ ఖతం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved