- Home
- Sports
- Cricket
- 25 ఏళ్ల క్రితం సచిన్ అదే చేశాడు! ఇప్పుడు నువ్వు కూడా ఆ పని చేయాలి... విరాట్ కోహ్లీకి రవిశాస్త్రి సలహా...
25 ఏళ్ల క్రితం సచిన్ అదే చేశాడు! ఇప్పుడు నువ్వు కూడా ఆ పని చేయాలి... విరాట్ కోహ్లీకి రవిశాస్త్రి సలహా...
హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఉన్నంతకాలం, టీమిండియాలో చక్రం తిప్పాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్ కోహ్లీ, రవిశాస్త్రి హయాంలో టీమిండియా ఘన విజయాలు అందుకుంది. విదేశాల్లో టెస్టు సిరీస్లను సొంతం చేసుకుంది. రెండుసార్లు ఆస్ట్రేలియాని ఆసీస్ గడ్డపైనే ఓడించింది...

ఒక్క ఐసీసీ టైటిల్స్ గెలవలేక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రవిశాస్త్రి, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రవిశాస్త్రి పోవడంతో విరాట్ కోహ్లీ ప్రాభవం కూడా పడిపోయింది...
Dhoni-Kohli-Ravi Shastri
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. ఆ తర్వాత టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. కోచ్గా రవిశాస్త్రి ఇచ్చిన అపరిమితమైన స్వేచ్ఛ కారణంగానే మూడేళ్ల పాటు విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేకపోయాడనే విమర్శలు కూడా వచ్చాయి..
టీ20, వన్డేల్లో ఫామ్ని తిరిగి అందుకున్నా టెస్టుల్లో మాత్రం వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. 2020 ఏడాది ఆరంభంలో 58కి పైగా ఉన్న విరాట్ కోహ్లీ టెస్టు సగటు ఇప్పుడు 48కి పడిపోయింది. మూడేళ్ల క్రితం టెస్టుల్లో హాఫ్ సెంచరీల కంటే ఎక్కువగా సెంచరీలు చేసిన కోహ్లీ... ఇప్పుడు ఆ రికార్డు కూడా కోల్పోయాడు...
Image credit: Getty
విరాట్ కోహ్లీ వన్డేల్లో, టీ20ల్లో అదరగొడుతున్నా టెస్టుల్లో అతని నుంచి సెంచరీ చూడాలని ఎక్కువగా కోరుకుంటున్నారు అభిమానులు. టెస్టు ఫార్మాట్ని ఎంతో ప్రేమించే విరాట్ కోహ్లీ... సుదీర్ఘ ఫార్మాట్లో ఫామ్లోకి వస్తే చాలా విమర్శలకు సమాధానం చెప్పినట్టు అవుతుంది...
Image credit: Getty
‘విరాట్ కోహ్లీ టీమ్లోకి వచ్చినప్పుడే అతను టెస్టులను ఎక్కువగా ప్రేమిస్తాడనే విషయం అర్థమైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎంత ఎక్కువగా ఆడితే భారత జట్టులో అంత ప్రయోజనం పొందొచ్చు. భారత జట్టు మున్ముందు చాలా మ్యాచులు ఆడనుంది..
ఇప్పుడు విరాట్ కోహ్లీ వన్డే మ్యాచులు ఆడడం కంటే టెస్టుల్లో ఫామ్ అందుకోవడంపై ఫోకస్ పెడితే బాగుంటుంది. కొన్నిసార్లు స్మార్ట్గా ఆలోచించి, జట్టులో స్థానం వదులుకోవడం ఎంతో మార్పు తీసుకొస్తుంది. ఆస్ట్రేలియాతో సిరీస్లో బాగా ఆడాలంటే రంజీ మ్యాచ్లో ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది...
25 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా టీమ్లో క్లబ్ క్రికెట్ ఆడడానికి వెళ్లి డబుల్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత రెండు నెలలకు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రెండు ఫార్మాట్లలో కలిపి 1000కి పైగా పరుగులు చేశాడు. నేను ఎందుకు క్లబ్ క్రికెట్ ఆడాలని సచిన్ అనుకోవచ్చు...
కానీ టెస్టు క్రికెట్కి ఎలా ప్రాక్టీస్ చేయాలో సచిన్ టెండూల్కర్కి బాగా తెలుసు. అందుకే ఆడాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్తో మూడో వన్డే నుంచి తప్పుకుని రంజీ ట్రోఫీ ఆడడం సరిగ్గా ఉంటుంది. ఎందుకంటే వన్డే మ్యాచ్ ఆడడం కంటే రంజీ మ్యాచ్ ఆడడం వల్ల టెస్టులకు ముందు బాగా ఉపయోగపడుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి..