- Home
- Business
- Alcohol Consumption: వామ్మో.. తెలంగాణలో ఇంతమంది మహిళలు మద్యం తాగుతున్నారా? సర్వేలో షాకింగ్ నిజాలు
Alcohol Consumption: వామ్మో.. తెలంగాణలో ఇంతమంది మహిళలు మద్యం తాగుతున్నారా? సర్వేలో షాకింగ్ నిజాలు
Womens Alcohol Consumption: పురుషులు మాత్రమే మద్యం తాగుతారని చాలామంది అనుకుంటారు. కొన్ని చోట్ల మహిళలు కూడా మద్యం తాగుతారు. అది ఆయా ప్రాంతాల సాంప్రదాయం కూడా. అయితే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు ఒత్తిడి, కష్టాలు తట్టుకోలేక అధికంగా ఆల్కహాల్ తాగుతారట. ఈ లిస్టులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. మరి ఇక్కడ ఎంతమంది మహిళలు ఆల్కహాల్ తాగుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సామాజిక కట్టుబాట్లను తెంచుకుంటూ మహిళలు పురుషులకు పోటీగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల్లోనూ రాణిస్తున్న మహిళలు మద్యం తాగడంలోనూ పురుషులతో పోటీ పడుతున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5), 2019-20 డేటా ఆధారంగా మహిళలు ఎక్కువగా మద్యం తాగే ఏడు రాష్ట్రాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యం తాగడం అన్ని చోట్ల ఒకేలా ఉండదు. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రంలో మద్యం తాగడం నిషేధం. అలాగే రాష్ట్రాల వారీగా ఆల్కహాల్ వినియోగం వేరుగా ఉంటుంది. భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ మంది మహిళలు మద్యపానానికి బానిసలుగా మారుతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. దీని ప్రకారం ఏ రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయో చూద్దాం.
టాప్ లో అరుణాచల్ ప్రదేశ్
మద్యం ఎక్కువగా తాగే మహిళలు ఉన్న రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ టాప్ లో ఉంది. ఇక్కడ 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 26 % మంది మహిళలు మద్యం తాగుతారు.
సెకెండ్ సిక్కిం
సిక్కింలో 16.2 % మంది మహిళలు మద్యం తాగుతారు. ఈ రాష్ట్రంలో ఇళ్లలోనే మద్యం తయారు చేసుకొని తాగుతారు. ఇది అక్కడ తరతరాలుగా వారసత్వంగా వచ్చిన సంప్రదాయం.
మూడో స్థానంలో అస్సాం
అస్సాంలో 7.3 % మంది మహిళలు మద్యం తాగుతారు. మొదటి రెండు ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే అస్సాంలోని గిరిజన సమాజాలు కూడా మద్యం తయారీ, వినియోగాన్ని ఒక సంప్రదాయంగా భావిస్తారు.
తెలంగాణకు నాలుగో స్థానం
దక్షిణ భారత రాష్ట్రంలో 6.7 % మంది మహిళలు మద్యం తాగుతారు. ఈ రాష్ట్రంలో గ్రామీణ మహిళలు పట్టణ మహిళల కంటే ఎక్కువగా మద్యం తాగుతారు.
జార్ఖండ్
జార్ఖండ్లో 6.1 % మంది మహిళలు ఆల్కహాల్ తీసుకుంటారు. ప్రధానంగా గిరిజన సమూహాలకు చెందినవారు, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో ఇక్కడ చాలా మంది మద్యానికి బానిసలుగా మారుతున్నారు.
అండమాన్, నికోబార్ దీవులు
ఈ లిస్టులో ఏకైక కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్, నికోబార్ దీవులలో 5 % మంది మహిళలు మద్యం తాగుతారు.
ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్లో దాదాపు 5 % మంది మహిళలు మద్యం తాగుతారు. ఒత్తిడి, మహిళలకు ఉపాధి అవకాశాలు లేకపోవడం తదితర కారణాలతో ఎక్కువ మంది మహిళలు మద్యానికి బానిసలవుతున్నారు.