MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Business
  • Gold Price Hike: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి

Gold Price Hike: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి

Gold Price Hike: బంగారం ఒక్కసారిగా భారీ బాంబ్ పేల్చింది. ధరలు ఊహించని రీతిలో తారాజువ్వలా దూసుకుపోయాయి. రూ.లక్షా యాభైవేలకు చేరడంతో చూసి పసిడి ప్రియుల గుండె గుబేల్‍మంటోంది. ఇక తగ్గడం కష్టమే అంటున్నారు నిపుణులు.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 06 2026, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి
Image Credit : chatgpt

రూ.3 వేలు పెరిగి షాక్ ఇచ్చిన పసిడి

దేశంలో బంగారం ధరలు మళ్లీ బిగ్ షాకిచ్చాయి. ఈ మధ్య కొంచెం కొంచెంగా పెరిగి ఈసారిగా ఏకంగా దాదాపు రూ.3వేలు పెరిగిపోయింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు ఇప్పుడు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, మధ్యప్రాచ్యంలోని అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలను మరింత పైకి తీసుకెళ్తున్నాయి. ఇక రూ.1.50 లక్షల మార్క్‌ను కూడా చేరిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ.1,49,730కు చేరిన తులం బంగారం
Image Credit : Getty

రూ.1,49,730కు చేరిన తులం బంగారం

ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,890 పెరిగి రూ.1,49,730కు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,650 పెరిగి రూ.1,37,250 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, తిరువనంతపురం వంటి నగరాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలకు అదనంగా జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కిలో వెండి ధర రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతోంది.

Related Articles

Related image1
Gold Price Hike: హర్మూజ్ సంక్షోభం ప్రభావం..రూ.1.50 లక్షల దిశగా బంగారం ధరలు
Related image2
Gold Price Fall: తగ్గిన బంగారం ధరలు.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మళ్లీ పెరుగుతాయా?
35
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మాటల యుద్ధం
Image Credit : Getty

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మాటల యుద్ధం

బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ డిమాండ్ పెరిగి, దాని ప్రభావం దేశీయ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది.

45
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Image Credit : Getty to Asianet

ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి కఠిన హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని, పరిస్థితి మరింత దిగజారితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఆ దేశం చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని కూడా వ్యాఖ్యానించారు. అణ్వాయుధాల అభివృద్ధికి అమెరికా ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వబోదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

55
చర్చలు జరుగుతున్నాయి: ఇరాన్
Image Credit : Asianet News

చర్చలు జరుగుతున్నాయి: ఇరాన్

మరోవైపు హర్మూజ్ జలసంధికి సంబంధించిన అంశాలపై ఇరాన్, ఒమన్‌తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాయి. అయితే అమెరికా ఈ చర్చల్లో భాగస్వామి కాదని, సముద్ర రవాణా భద్రతకు సంబంధించిన అంశాలపైనే తమ చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో ప్రాంతీయ పరిస్థితులపై మరింత ఉత్కంఠ నెలకొంది.

ప్రపంచ మార్కెట్‌లో ఉద్రిక్తతలు తగ్గే వరకు బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడి డిమాండ్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కలిసి బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు రోజువారీ ధరల మార్పులను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Biryani Business: బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే
Recommended image2
ATM: భారతదేశంలో మొట్టమొదటి ATM ఎక్కడ ఏర్పాటైంది? దాని వెనకాల ఉన్న చరిత్ర ఏంటో తెలుసా.?
Recommended image3
Gold Price Crash: 10 రోజుల తర్వాత దిగొచ్చిన బంగారం.. ఎంత తగ్గిందంటే?
Related Stories
Recommended image1
Gold Price Hike: హర్మూజ్ సంక్షోభం ప్రభావం..రూ.1.50 లక్షల దిశగా బంగారం ధరలు
Recommended image2
Gold Price Fall: తగ్గిన బంగారం ధరలు.. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మళ్లీ పెరుగుతాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved