MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • 8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘం నుండి 69 లక్షల మంది పెన్షనర్లను తప్పించారా?

8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘం నుండి 69 లక్షల మంది పెన్షనర్లను తప్పించారా?

8th Pay Commission: ఎనిమిదో వేతన సంఘం గురించి లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వేచి ఉన్నారు. అయితే పెన్షనర్లను మాత్రం తప్పించారనే సమాచారం వచ్చింది. ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియరాలేదు. ప్రభుత్వం కూడా స్పందించలేదు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 18 2025, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
8వ వేతన సంఘంలో మార్పులు జరిగాయా?
Image Credit : Pixabay

8వ వేతన సంఘంలో మార్పులు జరిగాయా?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, పదవీవిరమణ తర్వాత లభించే ప్రయోజనాలు వంటి అంశాలను పరిశీలించి సిఫార్సు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా విడుదలైన టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఒక ముఖ్యమైన అంశం లేకపోవడంతో దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బంది సంఘాల ప్రధాన కమిటీ అయిన నేషనల్ కౌన్సిల్ – జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెన్షనర్లను మర్చిపోయారా?
Image Credit : istock

పెన్షనర్లను మర్చిపోయారా?

మనదేశంలో సుమారు 69 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు. వీరి పింఛను కూడా వేతన సంఘం సిఫార్సుల ఆధారంగానే సవరణలు జరుగుతాయి. కానీ తాజాగా ప్రభుత్వం జారీ చేసిన 8వ వేతన సంఘం టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) లో పెన్షనర్ల గురించి స్పష్టమైన ప్రస్తావన లేదు. దీంతో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లు ఆందోళనపడుతున్నారు. తాము వేతన సంఘం పరిధిలో లేమా అనే సందేహంతో ఎంతోమంది పెన్షనర్లు కేంద్రానికి లేఖలు రాయడం ప్రారంభించినట్టు సమాచారం. 

దీంతో నేషనల్ కౌన్సిల్ – జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఉద్యోగులకే కాకుండా, పదవీవిరమణ చేసిన వారి ప్రయోజనాలు కూడా వేతన సంఘం పరిధిలో ఉండాలని మెషినరీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ సమాఖ్య నేతలు ప్రభుత్వం విడుదల చేసిన ToR ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తారు.

Related Articles

Related image1
Bank loan: సాలరీ స్లిప్పులు లేకపోయినా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం ఎలా?
Related image2
iPhone: ఐఫోన్15 కొనేందుకు ఇదే మంచి సమయం, భారీగా ధర తగ్గించిన అమెజాన్
34
పెన్షనర్ల గురించిన ప్రస్తావన లేకపోవడం
Image Credit : Pixabay

పెన్షనర్ల గురించిన ప్రస్తావన లేకపోవడం

Terms of Reference లో వేతనాలు, అలవెన్సులు, ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి ప్రస్తావించినా.. పెన్షనర్లు, కుటుంబ పెన్షన్ పొందేవారికి సంబంధించిన అంశాలు కనిపించలేదు. దీనివల్ల వీరిని వేతన సంఘం పరిధిలో నుండి తప్పించే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానం బలపడుతోంది. 7వ వేతన సంఘం నివేదిక 2016 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిందని అప్పుడే స్పష్టంగా చెప్పింది. కానీ 8వ వేతన సంఘం విషయంలో ఈ అమలు తేదీ ఇప్పటికీ క్లారిటీ లేదు. స్పష్టమైన తేదీ లేకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడు సవరణలు అమలులోకి వస్తాయో తెలియక ఇబ్బందిపడుతున్నారు.

44
ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘం
Image Credit : Pixabay

ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘం

ఇప్పటి వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి సవరణలు తరచుగా చేయవచ్చని ToR లో సూచన ఉండటం వల్ల భవిష్యత్తులో వేతన పెంపు ఎలా ఉంటుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే కొత్త సందేహాలు తలెత్తాయి. 9 లక్షల పెన్షనర్లను వేతన సంఘం పరిధి నుంచి తొలగించడం అంటే కోట్లాది కుటుంబాలపై ప్రభావం పడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
IPO: దేశంలోనే అతిపెద్ద IPOకి రంగం సిద్ధం.. రూ. 37,700 కోట్ల స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా
Recommended image2
India Debt: భారత్ పై 200 లక్షల కోట్ల అప్పు.. ఎవరి దగ్గర తీసుకుంది? వడ్డీ భారం ఎంతో తెలుసా?
Recommended image3
Post Office: రోజుకు రూ. 400 ప‌క్క‌న‌పెడితే చాలు.. వ‌డ్డీ రూపంలోనే రూ. 6 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Related Stories
Recommended image1
Bank loan: సాలరీ స్లిప్పులు లేకపోయినా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం ఎలా?
Recommended image2
iPhone: ఐఫోన్15 కొనేందుకు ఇదే మంచి సమయం, భారీగా ధర తగ్గించిన అమెజాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved