UPI Down: మీ ఫోన్ పే, గూగుల్ పే పనిచేస్తుందో చెక్ చేసుకున్నారా.? అసలేమైందంటే..
ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ లావా దేవీలు చేస్తున్నారు. అయితే తాజాగా సోమవారం యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ఈ వాలెట్స్లో లావాదేవీలు ఆగిపోయాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
సోమవారం సాయంత్రం భారతదేశంలో యుపీఐ వ్యవస్థలో భారీ అంతరాయం ఏర్పడింది. దీనివల్ల పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే వంటి డిజిటల్ లావాదేవీ యాప్ల వినియోగదారులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడడం ఈ నెలలో ఇది మూడోసారి కావడం గమనార్హం.
దేశవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు సోషియల్ మీడియాలో తమ చెల్లింపులు ఫెయిల్ అయ్యాయని, ఆలస్యం అవుతున్నాయని ఫిర్యాదులు చేశారు. డౌన్డిటెక్టర్ (Downdetector) అనే వెబ్సైట్ యుపీఐ సర్వీస్లో అంతరాయం వచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో కంప్లెయింట్లు వచ్చాయని తెలిపింది.
పేటీఎం యాప్లో "సాంకేతిక సమస్యలు ఉన్నాయి" అనే సందేశం చూపించగా, గూగుల్ పే, ఫోన్పే యాప్లలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. రోజూ యుపీఐ ద్వారా చెల్లింపులు చేసేవారికి, వ్యాపారులకు ఇది ఎక్కువ ఇబ్బంది కలిగించింది, ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో.
ఈ వ్యవస్థను నిర్వహించే NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. కాగా డిజిటల్ చెల్లింపులు భారతదేశంలో రికార్డులు సృష్టిస్తున్నాయి. మార్చి 2025లో 18.3 బిలియన్ యుపీఐ లావాదేవీలు జరిగాయి, ఫిబ్రవరిలో జరిగిన 16.11 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే ఇది ఎక్కువ. ఈ ట్రాన్సాక్షన్ల మొత్తం విలువ రూ. 24.77 లక్షల కోట్లకు చేరింది.
ఈ ఏడాది మార్చిలో ఫోన్పే యాప్ 864 కోట్ల లావాదేవీలతో ముందుండగా, గూగుల్ పే రెండో స్థానంలో ఉంది. పేటీఎం పరిమిత లావాదేవీలతో ఉన్నప్పటికీ చిన్న వ్యాపారులు, షాపులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఇటీవలే ప్రభుత్వం భీమ్ యాప్ ద్వారా యుపీఐ అందుబాటులోకి తెచ్చే చిన్న వ్యాపారులకు రూ. 1,500 కోట్ల ప్రోత్సాహక పథకం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరహా సమస్యలు రిపీట్ కావడం ఆందోళన కలిగిస్తున్నాయి.