MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • దిగొస్తున్న బంగారం-వెండి ధరలు.. త్వరలోనే భారీగా పెరిగే ఛాన్స్.. నేడు హైదరాబాద్ లో పసిడి ధర ఎంతంటే ?

దిగొస్తున్న బంగారం-వెండి ధరలు.. త్వరలోనే భారీగా పెరిగే ఛాన్స్.. నేడు హైదరాబాద్ లో పసిడి ధర ఎంతంటే ?

సోమవారం దేశీయ మార్కెట్‌లో బంగారం వెండి ఫ్యూచర్స్ ధర పెరిగింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎం‌సి‌ఎక్స్) లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగి 10 గ్రాములకు రూ.47,208 కి చేరుకుంది.  వెండి గురించి మాట్లాడుతూ నేడు 0.4 శాతం పెరిగి కిలో రూ. 61951 వద్ద ఉంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Aug 23 2021, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గత సంవత్సరం గరిష్ట స్థాయి (10 గ్రాములకు రూ. 56,200) నుండి  బంగారం ధర ఇప్పటికీ రూ. 8992 తగ్గింది. ఇంతకుముందు రోజు బంగారం ఫ్లాట్‌గా ముగిసింది, వెండి ధర 0.7 శాతం తగ్గింది.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నేడు బంగారం ధరలు ఔన్సు 0.1 శాతం తగ్గి 1,779.12 డాలర్లకు చేరుకున్నాయి. డాలర్ ఇండెక్స్ 93.33 వద్ద తొమ్మిది నెలల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతోంది. అయితే, కరోనావైరస్  డెల్టా వేరియంట్ వ్యాప్తి నుండి ఆర్థిక పతనంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య బంగారం నష్టాలు పరిమితం చేయబడ్డాయి. వెండి ఔన్స్ కి 0.2 శాతం పెరిగి 23.05 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం  998.85 డాలర్ల  వద్ద ఉంది.

36

ప్రపంచంలోని అతి పెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ లేదా గోల్డ్ ఇటిఎఫ్, ఎస్‌పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్  గోల్డ్ హోల్డింగ్స్ ధర ఆధారంగా గోల్డ్ ఇటిఎఫ్‌లు శుక్రవారం 0.3 శాతం తగ్గి 1,011.61 టన్నులకు చేరుకున్నాయి. గోల్డ్ ఇటిఎఫ్‌లు బంగారం ధరపై ఆధారపడి ఉంటాయి. బంగారం ధరలో హెచ్చుతగ్గులపై దాని ధర కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. బంగారంపై బలహీన పెట్టుబడిదారుల ఆసక్తిని ఇటిఎఫ్ ప్రవాహాలు ప్రతిబింబిస్తాయని గమనించాలి.  

46
జూన్ త్రైమాసికంలో గోల్డ్ ఇటిఎఫ్‌లో 1328 కోట్ల పెట్టుబడి

జూన్ త్రైమాసికంలో గోల్డ్ ఇటిఎఫ్‌లో 1328 కోట్ల పెట్టుబడి

జూన్ 2021తో ముగిసిన త్రైమాసికానికి పెట్టుబడిదారులు గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈ‌టి‌ఎఫ్) లో రూ .1,328 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన నెలల్లో ఈ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కోలుకునే అంచనాల మధ్య పెట్టుబడుల ప్రవాహాలు స్వల్పంగా తగ్గాయి.

56

ఈ సమాచారం భారతదేశంలోని మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (Amfi) డేటా నుండి పొందబడింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో గోల్డ్ ఇటిఎఫ్‌లలో పెట్టుబడి  రూ. 2,040 కోట్లుగా ఉంది. పెట్టుబడుల ప్రవాహం తగ్గినప్పటికీ, 2021 జూన్ చివరి నాటికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణ (AUM) ఆస్తులు రూ .16,225 కోట్లకు పెరిగాయి. ఏ‌యూ‌ఎం జూన్ 2020 చివరి నాటికి రూ. 10,857 కోట్లుగా ఉంది.
 

66

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం ( ఆగస్టు 23) బంగారం ధర  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.48,160 చేరింది.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.44,140కు దిగివచ్చింది.   వెండి ధర  కేజీకి రూ.66,660. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి  శుభ వార్త అని చెప్పొవచ్చు.  

About the Author

AK
Ashok Kumar
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Today: చర్చలకు సిద్ధమైన అమెరికా-ఇరాన్..ఇవాళ స్థిరంగా బంగారం ధరలు
Recommended image2
బ‌స్సులో సీటు దొర‌క్క‌పోయినా, క్యూ లైన్లో నిల‌బ‌డ్డా.. ఈ మ‌డ‌త పెట్టే కుర్చీ ఉంటే బిందాస్
Recommended image3
US Minimum Wage: అమెరికాలో కనీస వేతనం ఎంత? ఇండియాతో పోలిస్తే వ్యత్యాసం ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved