వాహనదారులకు చుక్కలు.. నేడు మరోసారి ఎగిసిన పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశవ్యాప్తంగా నేడు ఇంధన ధరలు గురువారం మరోసారి పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) వెబ్ సైట్ సమాచారం ప్రకారం నేడు పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త గరిష్టనికి చేరాయి. గత రెండు రోజుల విరామం తరువాత ఈ రోజు పెట్రోల్ ధర 31 - 39 పైసలు పెరగగా, మరోవైపు డీజిల్ ధరల 15 - 21 పైసలు పెరిగింది.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102 దాటగా, ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107 దాటి కొత్త గరిష్ట స్థాయికి చేరాయి. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.107.54 ఉంది, దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.54. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.23 చేరి కొత్త గరిష్టాలను దాటింది. కోల్కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ .101.74, బెంగళూరు నగరంలో పెట్రోల్ ధర రూ .104.94గా ఉంది.
ముంబైలో ప్రస్తుత డీజిల్ ధర లీటరుకు రూ.97.45. ఢీల్లీలో డీజిల్ ధర లీటరుకు రూ .89.89, చెన్నైలలో లీటరుకు రూ.94.39, బెంగళూరులో డీజిల్ ధర లీటరుకు రూ.95.26. ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ .105.52 ఉండగా, డీజిల్ ధర రూ.97.96గా ఉంది.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు..
నగరం డీజిల్ పెట్రోల్
ఢీల్లీ 89.87 101.54
ముంబై 97.45 107.54
కోల్కతా 93.02 101.74
చెన్నై 94.39 102.23
పెట్రోల్ ధర 100 దాటిన నగరాలు ..
నగరం పెట్రోల్ ధర
ముంబై 107.54
న్యూఢిల్లీ 101.54
కోల్కతా 101.74
చెన్నై 102.23
బెంగళూరు 104.94
భువనేశ్వర్ 102.36
జైపూర్ 108.40
పాట్నా 103.72
తిరువనంతపురం 103.17
భోపాల్ 109.89
కోయంబత్తూర్ 102.46
నాసిక్ 107.53
నాగ్పూర్ 106.95
శ్రీనగర్ 104.04
విశాఖపట్నం 106.45
పూణే 107.11
ఇండోర్ 109.68