వాహనదారులకు ఇంధన ధరల షాక్.. నేడు మరిన్ని రాష్ట్రాలలో సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర..
నేడు ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను సవరించాయి. రెండు రోజులు విరామం తరువాత పెట్రోల్ ధరపై గరిష్టంగా 35 నుండి 40 పైసలు పెరిగింది. ఈ పెంపుతో జూలై నెలలో ఇది మొదటి పెరుగుదల.
దీంతో ఢీల్లీలో పెట్రోల్ ధర రూ .99.16 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ .89.18. ముంబైలో పెట్రోల్ ధర రూ .105.24, డీజిల్ ధర లీటరుకు రూ.96.72. తాజా పెంపుతో ఎనిమిది రాష్ట్ర రాజధానులలో పెట్రోలు ధర సెంచరీ మార్క్ను దాటి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. పెట్రోలు ధర 100 రూపాయలు దాటి నగరాల్లో ఇపుడు చెన్నై చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.100.13, డీజిల్ రూ.93.72గా ఉంది.
నేడు ఢీల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలలో ఒక లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు
నగరం డీజిల్ పెట్రోల్
ఢీల్లీ 89.18 99.16
ముంబై 96.72 105.24
కోల్కత 92.03 99.04
చెన్నై 93.72 100.13
హైదరాబాద్ 97.20 103.05
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకోండి
ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం, మీరు ఆర్ఎస్పి అండ్ మీ సిటీ కోడ్ను టైప్ చేసి 9224992249 నంబర్కు పంపించాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.
ముంబై, హైదరాబాద్, బెంగళూరు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో పెట్రోల్ ధర ఇప్పటికే రూ .100 దాటింది.
ప్రతి రోజు ఉదయం 6 గంటలకు
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు సమీక్షిస్తుంటారు. ఉదయం 6 గంటల నుండి కొత్త ధరలు వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పరిమితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సావరిస్తాయి.