MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Income Tax Bill 2025: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును కేంద్రం ఎందుకు వెనక్కి తీసుకుంది?

Income Tax Bill 2025: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును కేంద్రం ఎందుకు వెనక్కి తీసుకుంది?

Income Tax Bill 2025: కొత్త ఆదాయపు పన్ను బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. అన్ని మార్పులతో నవీకరించిన బిల్లును ఆగస్టు 11న మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. పలు అంశాలకు సంబంధించి సెలెక్ట్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 08 2025, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
Image Credit : Getty

కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలనుకున్న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును వెనక్కి తీసుకుంది. ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం తాజాగా వెనక్కి తీసుకుంది. 

అయితే ఇది తాత్కాలిక వెనుకడుగు మాత్రమేనని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అన్ని సవరణలతో, పలు మార్పులతో మరింత స్పష్టతతో కూడిన బిల్లును ఆగస్టు 11న తిరిగి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

DID YOU
KNOW
?
భారత ఆదాయపు పన్ను చట్టం 1961
భారత ఆదాయపు పన్ను చట్టం 1961లో ఆమోదించారు. ఇది 1962 ఏప్రిల్ 1న అమలులోకి వచ్చింది. పాత చట్టాన్ని భర్తీ చేసి, సులభతరంగా రూపొందించేందుకు 2025లో కొత్త బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.
25
ప్రతిపక్షాల అభ్యంతరాలతో కమిటీకి పంపిన బిల్
Image Credit : Getty

ప్రతిపక్షాల అభ్యంతరాలతో కమిటీకి పంపిన బిల్

బిల్లుపై విపక్షాల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో, దీనిని బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ 4500 పేజీల నివేదిక సమర్పిస్తూ, 285 కీలక సిఫార్సులను చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకొని, కేంద్రం బిల్లులో మార్పులు చేస్తోంది.

Related Articles

Related image1
Top 5G Phones Under Rs 15000: ఐక్యూ నుంచి సామ్‌సంగ్‌ వరకు.. రూ.15,000లోపు టాప్-5 బెస్ట్ 5G ఫోన్లు
Related image2
Top 10 Temples Telangana: తెలంగాణలో త‌ప్ప‌క చూడాల్సిన టాప్-10 దేవాలయాలు
35
సెలెక్ట్ కమిటీ సిఫార్సుతో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లులో ముఖ్యమైన మార్పులు
Image Credit : Getty

సెలెక్ట్ కమిటీ సిఫార్సుతో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లులో ముఖ్యమైన మార్పులు

సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సుల్లో గృహ రుణ వడ్డీలపై మినహాయింపులు, ఖాళీగా ఉన్న ఆస్తులపై ఆదాయ పన్ను లెక్కింపు, పింఛన్ మినహాయింపులు వంటి అంశాలపై స్పష్టత కల్పించడం ప్రధానంగా ఉన్నాయి.

అలాగే, వాణిజ్య ఆస్తులపై పన్నుల విధానం, గందరగోళంగా ఉన్న క్లాజ్‌లను సవరించాలని కమిటీ పేర్కొంది. కమిటీ సూచించిన విధంగా సాధారణ క్రమంలో అనే పదాన్ని తొలగించి వాస్తవ ఆదాయాన్ని మాత్రమే పరిగణించాలన్న ప్రతిపాదన ఉంది.

45
పాత చట్టానికి మార్పులు అవసరాన్ని స్పష్టం చేసిన ప్రభుత్వం
Image Credit : Getty

పాత చట్టానికి మార్పులు అవసరాన్ని స్పష్టం చేసిన ప్రభుత్వం

1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం అనేక బడ్జెట్లలో మార్పులు చెందుతూ సంక్లిష్టంగా మారింది. పన్ను చెల్లింపుదారులకు అర్థం చేసుకోవడంలో క్లిష్టతలు ఏర్పడ్డాయి.

అందువల్ల 2024 బడ్జెట్‌లో కేంద్రం ఈ చట్టాన్ని సరళతరం చేస్తామని ప్రకటించింది. దీనితోనే కొత్త బిల్లుకు పునాది పడింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ముందుకు వచ్చిన బిల్లు మరోసారి మార్పులతో మళ్లీ చట్ట సభల ముందుకు రానుంది.

55
ఆగస్టు 11న మార్పులు చేసిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు 2025 ప్రవేశం
Image Credit : freepik

ఆగస్టు 11న మార్పులు చేసిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు 2025 ప్రవేశం

విచారణలు, సూచనలు, లోపాల సవరణలతో కూడిన కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు 2025ను ఆగస్టు 11న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిలో 23 అధ్యాయాలు, 536 సెక్షన్లు, 16 షెడ్యూల్స్ ఉన్నాయి.

పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండేలా చిన్న మినహాయింపులు, స్పష్టమైన విధానాలతో రూపొందించారని సమాచారం. పాత బిల్లులోని ముసాయిదా లోపాలు, భాషా దోషాలను సవరించి, కొత్త పద్ధతులను సమర్పించేందుకు కేంద్రం సిద్ధమైంది.

ఈ కొత్త బిల్లుతో, పన్ను చెల్లింపు వ్యవస్థను మరింత సుస్పష్టం చేసి, డిజిటల్ ఆధారితంగా మానవ జోక్యం తగ్గించి, ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రజలకు దగ్గర చేయాలన్నది కేంద్ర లక్ష్యంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
భారత పార్లమెంటు
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved