బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ .. నేటి నుంచి బ్యాంక్ వేళల్లో మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే..
తెలంగాణ రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా లాక్డౌన్ సడలింపు మధ్యానం 1 గంట వరకు విధించడంతో బ్యాంక్ పని సమయాన్ని కూడా తగ్గించారు.
ఇప్పుడు లాక్డౌన్ సడలింపు సాయంత్రం 5 గంటవ వరకు ఇవ్వడంతో బ్యాంకు పని వేళలు ఎప్పటిలాగే ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో కొద్దిరోజుల పాటు బ్యాంకులు పనివేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు కొనసాగాయి. ఇప్పుడు తాజా సడలింపు ప్రకటించడంతో బ్యాంకు పనివేళ్లలో కూడా మార్పులు చేస్తూ నిర్ణయం వెలువడింది. దీంతో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి.
మారిన బ్యాంకు వేళలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల టైమింగ్స్ యధావిధిగా ఉండనున్నాయి.
నిన్న జరిగిన సమావేశంలో లాక్డౌన్ ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించడంతో పాటు సడలింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు పెంచారు.