MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • పెట్టుబడిదారులను భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. 7 నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీకి వరస్ట్ డే..

పెట్టుబడిదారులను భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. 7 నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీకి వరస్ట్ డే..

కొత్త  కరోనావైరస్ వేరియంట్‌ను గుర్తించడం ద్వారా పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినడంతో బలహీనమైన ప్రపంచ సూచనల కారణంగా భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు ఏప్రిల్ 12 నుండి సింగిల్ డేలో  నేడు కనిష్ట  స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 1,801 పాయింట్లు లేదా 3 శాతం వరకు పడిపోయింది అలాగే నిఫ్టీ 50 ఇండెక్స్   17,000 దిగువకు పడిపోయి 16,985 ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. దీంతో సెన్సెక్స్,  నిఫ్టీ మూడు నెలల్లో కనిష్ట స్థాయికి పడిపోయాయి.

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 26 2021, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

చివరకి  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,688 పాయింట్లు లేదా 2.87 శాతం పడిపోయి 57,107 వద్ద ముగియగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 510 పాయింట్లు లేదా 2.9 శాతం పడిపోయి 17,026 వద్ద ముగిసింది.

ఈ రోజు ట్రేడింగ్‌ను పరిశీలిస్తే రెండు సూచీలు నష్టాలలో  ప్రారంభమైన కొద్దిసేపటికే భారీగా పడిపోయాయి. ఉదయం 10.35 గంటల సమయానికి సెన్సెక్స్ 1,300 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది. దీని తరువాత, సెన్సెక్స్ ఉదయం 11 గంటల వరకు 1460 పాయింట్లు జారిపోయి కనిష్ట స్థాయికి చేరుకుంది.

దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ కనుగొనబడిన తర్వాత పెట్టుబడిదారుల ఆందోళనలు కూడా పెరిగాయి. కొత్త వేరియంట్ B.1.1529 డెల్టా కంటే ప్రమాదకరమైనదని, దక్షిణాఫ్రికాలో 30 కంటే ఎక్కువ కొత్త కేసులు కనుగొనడంతో శాస్త్రవేత్తలు హెచ్చరించారు.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

గ్లోబల్ స్టాక్స్ కూడా నేడు శుక్రవారం పతనమయ్యాయి. యూరోపియన్ స్టాక్‌లు 2.7 శాతం, జర్మనీకి చెందిన డి‌ఏ‌ఎక్స్ 3 శాతం, బ్రిటన్ ఎఫ్‌టి‌ఎస్‌ఈ 100 2.7 శాతం పడిపోయి ఒక నెల కంటే కనిష్ట స్థాయికి పడిపోయింది.


దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్‌లలో కనుగొనబడిన వేరియంట్ గురించి చాలా తక్కువగా తెలుసు, కానీ శాస్త్రవేత్తలు దీనిని అసాధారణమైన మ్యూటేషన్ కలిగి ఉందని, రోగనిరోధకను తప్పించుకోగలదని అలాగే మరింత వ్యాప్తి చేయగలదని చెప్పారు.


"కొత్త కోవిడ్-19 వేరియంట్ ఆవిర్భావం మధ్య ఈక్విటీ మార్కెట్లు దాదాపు 2 శాతం పడిపోయాయి. యూరోపియన్ యూనియన్ (EU)దక్షిణాఫ్రికా నుండి విమానాలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది  అలాగే కొన్ని ఈ‌యూ దేశాలు ఇప్పటికే పూర్తి లాక్‌డౌన్ స్థాయిలో ఉన్నాయి. అందువల్ల ఈ కొత్త భయం ఏర్పడింది. ఇతర దేశాలకు వ్యాపిస్తున్న వేరియంట్ మళ్లీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసే అవకాశం ఉంది. యూ‌ఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను ఎప్పుడు పెంచుతుందనే దానిపై ఇప్పటికే అనిశ్చితి ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతూనే ఉండవచ్చు అలాగే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితిని చురుకుగా ట్రాక్ చేయవచ్చు, ”అని  బ్రోకరేజీకి చెందిన సంస్థ  మోతీలాల్ ఓస్వాల్ హేమాంగ్ జానీ ఒక ప్రకటనలో తెలిపారు.

34

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 15 సెక్టార్ గేజ్‌లలో పదమూడు నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 6 శాతానికి పైగా క్షీణతతో దిగువన ముగియడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కూడా 3.5-5 శాతం మధ్య పతనమయ్యాయి.

మరోవైపు ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 3.25 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 2.9 శాతం క్షీణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

44

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.88 వద్ద ఉంది. జే‌ఎస్‌డబల్యూ స్టీల్ టాప్ నిఫ్టీ లూజర్‌గా ఉంది, స్టాక్ 7.5 శాతం పడిపోయి  రూ.630 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారత్ పెట్రోలియం, మారుతీ సుజుకి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, NTPC, ONGC, టాటా కన్స్యూమర్ ఉత్పత్తులు కూడా 5-7 శాతం మధ్య పడిపోయింది. మరోవైపు సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్, నెస్లే ఇండియాలు చెప్పుకోదగ్గ లాభాల్లో ఉన్నాయి.

 

About the Author

AK
Ashok Kumar
స్టాక్ మార్కెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Recommended image2
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
Recommended image3
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved