స్టాక్ మార్కెట్ అప్డేట్: సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా జూమ్.. 16,496 వద్ద నిఫ్టీ.. ఐటి స్టాక్స్ జిగేల్..
నేడు సోమవారం స్టాక్ మార్కెట్ రోజంతా హెచ్చు తగ్గులు తర్వాత లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 226.47 పాయింట్ల లాభంతో (0.41 శాతం) 55,555.79 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 45.95 పాయింట్ల (0.28 శాతం) లాభంతో 16,496.45 వద్ద ముగిసింది.
గత వారం 30-షేర్ల బిఎస్ఈ సెన్సెక్స్ 107.97 పాయింట్లు అంటే 0.19 శాతం పడిపోయింది. మొత్తం సెషన్లో సెన్సెక్స్ 55,781.17 గరిష్ట స్థాయిని 55,240.29 కనిష్ట స్థాయిని తాకి చివరకు 55,555.79 వద్ద స్థిరపడింది. బిఎస్ఇలో హెచ్సిఎల్ టెక్నాలజీస్, నెస్లే, టిసిఎస్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్ నిఫ్టీ లాభాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటోలు అత్యధికంగా నష్టపోయాయి.
అన్ని సెక్టోరల్ ఇండెక్స్లలో నిఫ్టీ ఐటి ఇండెక్స్ ఒక్కొక్కటి 1.7 శాతం లాభపడగా, మెటల్, ఆటో అండ్ పిఎస్యు బ్యాంక్ సూచీలు 0.5-1.5 శాతం నష్టపోయాయి. బిఎస్ఇ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.90 శాతం, స్మాల్ క్యాప్ 1.5 శాతం పడిపోయాయి.
ఉదయం 10.57 గంటలకు సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ రెండూ రెడ్ జోన్ లోకి ప్రవేశించాయి. తరువాత రెండు బెంచ్మార్క్ సూచికలు కోలుకొని గ్రీన్ జోన్లోకి ప్రవేశించాయి.
పెట్టుబడిదారులకు ఎన్ఎస్ఈ సలహా
ఆన్ రెగ్యులేటెడ్ డెరివేటివ్స్ ప్రాడెక్ట్స్ లో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలని ఎన్ఎస్ఇ ఇన్వెస్టర్లను కోరింది. పెట్టుబడిదారులు ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్ ప్లాట్ఫారమ్ల డైవర్జెన్స్ అండ్ బైనరీ ఆప్షన్స్ నివారించాలని ఎన్ఎస్ఈ తెలిపింది. ఎందుకంటే పెట్టుబడిదారులు ఈ ప్లాట్ఫారమ్ల నుండి భారీ ఆదాయాన్ని ఆశించి ఆపై భారీ నష్టాలను చవిచూస్తారు అని సూచించింది. అందువల్ల పెట్టుబడిదారులు ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలని తెలిపింది.
ఈ వారం స్టాక్ మార్కెట్ల దిశ ప్రపంచ ధోరణి ద్వారా నిర్ణయించబడుతుంది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ పెరుగుతున్న కేసుల ద్వారా మార్కెట్ దిశ కూడా నిర్ణయించబడుతుంది. క్యూ1 త్రైమాసిక ఫలితాల సీజన్ ముగిసిందని విశ్లేషకులు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో రూపాయి హెచ్చుతగ్గులు, బ్రెంట్ ముడి చమురు ధర, విదేశీ నిధుల ప్రవాహం కూడా షేర్ మార్కెట్ ను దిశానిర్దేశం చేస్తుంది.
సెక్టోరల్ ఇండెక్స్ని పరిశీలిస్తే నేడు ఐటి, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు లాభాలతో ముగిశాయి. మరోవైపు, ఎఫ్ఎంసిజి, పిఎస్యు బ్యాంక్, ఫార్మా, ఆటో, మెటల్, రియల్టీ, మీడియా, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు నష్టాలతో ముగిశాయి.
సెన్సెక్స్-నిఫ్టీ గత వారం శుక్రవారం కాస్త అస్థిరత తర్వాత రెడ్ మార్క్లో ముగిసింది. సెన్సెక్స్ 300.17 పాయింట్లు (0.54 శాతం) తగ్గి 55,329.32 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 118.35 పాయింట్లు (0.71 శాతం) తగ్గి 16,450.50 వద్ద ముగిసింది.