స్టాక్ మార్కెట్లో సంక్రాంతి జోష్.. వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు..
స్టాక్ మార్కెట్ (stockmarket)నేడు వరుసగా మూడో రోజు లాభాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 61 వేల స్థాయిని దాటి 533 పాయింట్ల లాభంతో 61,150 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ కూడా 156 పాయింట్ల లాభంతో 18,212 వద్ద ముగిసింది.
సెన్సెక్స్, నిఫ్టీ
స్టాక్ మార్కెట్ బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై బిఎస్ఇ 30 షేర్ల సూచీ సెన్సెక్స్ 312 పాయింట్లు జంప్ చేసి 60,946 వద్ద, ఎన్ఎస్ఇ నిఫ్టీ 101 పాయింట్లు లాభపడి 18,154 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి.
మంగళవారం స్టాక్ మార్కెట్
స్టాక్ మార్కెట్ మంగళవారం వరుసగా మూడో రోజు లాభాలలో ముగిసింది. బిఎస్ఇ సెన్సెక్స్ 221 పాయింట్లు ఎగబాకి 60,617 వద్ద, ఎన్ఎస్ఇ నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 18,055 వద్ద ముగిసింది.
ఈరోజు పెరుగుదల కారణంగా మార్కెట్ క్యాప్ రూ.276.64 లక్షల కోట్లు దాటింది. మంగళవారం మార్కెట్లో ర్యాలీ కారణంగా బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.275.27 లక్షల కోట్లకు చేరుకుంది.
బుధవారం సెన్సెక్స్ 61,000 స్థాయిని అధిగమించగా, నిఫ్టీ 18,200 మార్క్కు దాటి స్థిరపడడంతో భారత సూచీలు బుధవారం వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు క్యూ3 ఫలితాలను ప్రకటించే మూడు ఐటీ దిగ్గజాలు టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో పై పెట్టుబడిదారులు దృష్టి కేంద్రీకరించింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్లు కూడా బెంచ్మార్క్లకు అనుగుణంగా ర్యాలీ చేశాయి.
ఎం&ఎం, భారతీ ఎయిర్టెల్ చార్టులో అగ్రస్థానంలో ఉండగా, టిసిఎస్ అండ్ టైటాన్ వెనుకబడి ఉన్నాయి. సెక్టార్లలో ఫార్మా మాత్రమే నష్టపోగా, ఆటో, మెటల్, రియల్టీ బెస్ట్ లాభపడ్డాయి.