గణేషుడి విగ్రహంతో సెల్ఫీ.. రిలయన్స్ ‘ట్రెండ్స్’నుంచి ఆసక్తికరమైన పోటీ..
హైదరాబాద్, 10 సెప్టెంబర్ 2021: రిలయన్స్ రీటైల్ కు చెందిన 'ట్రెండ్స్' వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా రాష్ట్రాలలో 'ట్రెండ్స్ సెల్ఫీ విత్ గణేష్' పోటీని ప్రకటించింది.
గణేషుడి విగ్రహంతో ట్రెండ్స్ సెల్ఫీ అనే ఈ ఆసక్తికరమైన పోటీ శుభప్రదమైన గణేష్ చతుర్థి పండుగ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 వరకు ఉంటుంది. ఇది ప్రధానంగా ట్రెండ్స్ తన వినియోదారుల నుంచి ఎంట్రీలు ఆహ్వానించే పోటీ.వినియోగదారులు తమ ఇళ్లల్లో గణేశుడి విగ్రహం వద్ద అలంకరణతో పాటు తాము తీసుకున్న ఫోటో లేదా సెల్ఫీ ని ఈ పోటీకి ఎంట్రీ గా పంపించవచ్చు.
'ఉత్తమమైన గణేష విగ్రహం అలంకరణ' గా నిర్ణయించబడిన సెల్ఫీ కి రూ. 1500 విలువ చేసే బహుమతి లభిస్తుంది. అంతే కాదు, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ట్రెండ్స్ నుంచి డిస్కౌంట్ కూపన్ కూడా లభిస్తుంది. దీనిని మీరు దగ్గరలో ఉన్న ట్రెండ్స్ స్టోర్ నుంచి పొందవచ్చు.
ఈ పోటీ గురించి ప్రకటన, ఇందులో పాల్గొనే పద్ధతి, ఇతర వివరాలను వినియోగదారులకు వారి సమీపంలోని ట్రెండ్స్ స్టోర్ నుంచి అందించబడతాయి. పోటీలో విజేతలు ఆయా పట్టణాలకు చెందిన సుప్రసిద్ధ ఆర్ట్ టీచర్ల ద్వారా ఎంపిక చేయబడతారు.
కనుక, ఈ గణేష్ చతుర్థికి మీకు ఎన్ని ప్రణాళికలు ఉన్నా మీ అన్ని ఫ్యాషన్ అవసరాలకు మాత్రం మీ సమీపంలోని ట్రెండ్స్ స్టోర్ కి వెళ్లి షాపింగ్ చెయ్యండి. ముఖ్యంగా గణేషుడి విగ్రహంతో సెల్ఫీ పోటీలో పాల్గొనడం మిస్ కాకండి.
డిజిటల్ / సోషల్ మీడియా లో ట్రెండ్స్ ని ఇక్కడ ఫాలో అవ్వండి...
Facebook: https://www.facebook.com/RelianceTrends
Twitter: https://twitter.com/RelianceTrends
Instagram: https://www.instagram.com/reliancetrends/
Youtube: https://www.youtube.com/user/RelianceTrendsLive
Website: https://www.trends.ajio.com