రిలయన్స్ జియో స్పెక్ట్రమ్ ప్రీపేమెంట్.. వడ్డీతో సహా 30వేల కోట్ల సెటిల్మెంట్ .. ఏటా రూ. 1,200 కోట్లు ఆదా..
జియో ప్లాట్ఫారమ్ల అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL)మార్చి 2021కి ముందు వేలంలో పొందిన స్పెక్ట్రమ్(spectrum)కు సంబంధించిన మొత్తం వాయిదా పడిన లయబిలిటీస్ ముందస్తు చెల్లింపు కోసం టెలికాం డిపార్ట్మెంట్(DoT)కు ఆర్జిత వడ్డీతో సహా రూ.30,791 కోట్లు చెల్లించినట్లు బుధవారం ప్రకటించింది.
“కంపెనీ వేలం అండ్ ట్రేడింగ్లో 585.3 MHz స్పెక్ట్రమ్ను కొనుగోలు చేసింది. RJIL 2016 సంవత్సరంలో వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్కు సంబంధించిన మొదటి విడత ప్రీపేమెంట్ను అక్టోబర్ 2021 నెలలో వార్షికోత్సవం రోజున అమలు చేసింది" అని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలియజేసింది.
ఆర్జేఐఎల్ 2016 సంవత్సరంలో వేలంలో పొందిన స్పెక్ట్రమ్కు సంబంధించి 2021 అక్టోబర్ నెలలో వార్షికోత్సవ తేదీన మొదటి విడత ముందస్తు చెల్లింపును అమలు చేసింది.
డిసెంబర్ 2021 నెలలో టెలికాం డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, టెలికాం కంపెనీలు వాయిదాపడిన స్పెక్ట్రమ్ లియబిలిటీస్ ఏ తేదీలోనైనా ముందస్తుగా చెల్లించే సౌలభ్యాన్ని అందించాయి, ఆర్జేఐఎల్ ఇప్పుడు జనవరి 2022 నెలలో ముందస్తు చెల్లింపు చేసింది, అయితే 2014 సంవత్సరంలో వేలంలో పొందిన మొత్తం అలాగే 2015 ట్రేడింగ్ ద్వారా పొందిన స్పెక్ట్రమ్ వాయిదా పడింది.
ఈ లియబిలిటీస్ 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 2034-2035 వరకు వార్షిక వాయిదాలలో చెల్లించబడ్డాయి. ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధితో 9.30% నుండి 10% p.a మధ్య వడ్డీ రేటును కలిగి ఉంటాయి.
ముందస్తు చెల్లింపుల వల్ల ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం సంవత్సరానికి రూ.1,200 కోట్ల వడ్డీ ఆదా అవుతుందని కంపెనీ అంచనా వేసింది . భారతీ ఎయిర్టెల్ గత నెలలో టెలికాం డిపార్ట్మెంట్కి రూ.15,519 కోట్లను చెల్లించి, 2014 సంవత్సరం వేలంలో పొందిన స్పెక్ట్రమ్కు సంబంధించిన మొత్తం వాయిదా పడిన లియబిలిటీస్ ముందస్తుగా చెల్లించింది.