MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • జియో నుంచి 'సౌండ్‌ పే' ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటో తెలుసా?

జియో నుంచి 'సౌండ్‌ పే' ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటో తెలుసా?

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న జియో తాజాగా 'జియో సౌండ్ పే' పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఏంటీ ఫీచర్‌.? ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Narender Vaitla
Published : Jan 25 2025, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

టెలికం రంగంలో జియో ఒక సంచలనమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జియో రాకతో టెలికం రంగం రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. మొబైల్ నెట్‌ వర్క్‌ మొదలు, ఫైబర్‌ వరకు అన్ని రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో మార్కెట్లో పోటీనిచ్చింది. జియో భారత్‌ ఫోన్‌ పేరుతో తక్కువ బడ్జెట్‌లో అన్ని రకాల ఫీచర్లను కోరుకునే వారి కోసం ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్‌లో సూపర్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 
 

24

ప్రస్తుతం ఈ చిన్న దుకాణానికి వెళ్లినా అక్కడే ఫోన్‌పే, పేటీఎంకు చెందిన సౌండ్‌ బాక్స్‌లు కనిపిస్తున్నాయి. ఎవరైనే పేమెంట్ చేయగానే అమౌంట్‌ వచ్చిన విషయాన్ని తెలియజేస్తాయి ఈ బాక్స్‌లు. యూపీఐ పేమెంట్స్‌లో కచ్చితత్వం కోసం ఈ సౌండ్‌ బాక్స్‌లు ఉపయోగపడతాయి. అయితే వీటిని ఉపయోగించుకోవాలంటే కస్టమర్లు ప్రతీ నెలా రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూపాయి కూడా చెల్లించకుండా ఈ సేవలను అందించేందుకు జియో ముందుకొచ్చింది. 

34

జియో భారత్‌ ఫోన్‌లలో జియో సౌండ్‌ పే పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ ఫోన్‌లోనే పేమెంట్‌ రిసీవ్‌కు సంబంధించిన మెసేజ్‌ను వినొచ్చు. అయితే జియో ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందించడం విశేషం. అంతేకాకుండా తాము  ఎంచుకున్న భాషలో వినే అవకాశాన్ని జియో కల్పించింది. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయమై జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్ సునీల్‌ మాట్లాడుతూ.. 'టెక్నాలజీని మరింత అందిపుచ్చుకుంటూ ప్రతి భారతీయుడి సాధికారతే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నాం' అని చెప్పుకొచ్చారు. 
 

44

జియో సౌండ్‌ పే ఫీచర్‌తో ఎలాంటి సౌండ్‌ బాక్సులు అవసరం లేకుండానే ఫోన్‌లోనే కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ వినొచ్చు. ఈ ఫీచర్‌ సహాయంతో వ్యాపారులకు ఏడాదికి రూ. 1500 వరకు ఆదా అవుతుందని జియో తెలిపింది. ఇదిలా ఉంటే 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియోసౌండ్‌పేలో "వందేమాతరం" ఆధునిక సంస్కరణలను కూడా ప్రారంభించింది. దీంతో యూజర్లు మైజియో యాప్ లేదా జియో సావన్‌ ద్వారా ఈ రెండిషన్‌లను వారి జియోట్యూన్‌లుగా సెట్ చేసుకోవచ్చు.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Recommended image2
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Recommended image3
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved