MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ATM: ఏటీఎమ్ ఉప‌యోగించే వారికి గుడ్ న్యూస్‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఆర్బీఐ

ATM: ఏటీఎమ్ ఉప‌యోగించే వారికి గుడ్ న్యూస్‌.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఆర్బీఐ

దేశంలో డిజిట‌ల్ లావాదేవీలు పెరిగింది. దీంతో మార్కెట్లో న‌గ‌దు క్ర‌మంగా త‌గ్గింది. ముఖ్యంగా ఏటీఎమ్‌ల‌లో కేవ‌లం రూ. 500 నోట్లు మాత్ర‌మే అందుబాటులో ఉంటున్నాయి. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

1 Min read
Narender Vaitla
Published : Jun 17 2025, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం
Image Credit : ASphotofamily@freepik

ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, వచ్చే సెప్టెంబర్ 30, 2025 నాటికి దేశంలోని 75% ఏటీఎంలలో కనీసం ఒక క్యాసెట్ నుంచి రూ.100 లేదా రూ.200 నోట్లను ఇవ్వాల్సిందేన‌ని తెలిపింది. అయితే బ్యాంకులు ఇప్పటికే ఈ లక్ష్యానికి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 73% ఏటీఎంలు ఈ చిన్న నోట్లను అందిస్తున్నాయి.

25
73 శాతానికి పెరిగిన నోట్లు
Image Credit : our own

73 శాతానికి పెరిగిన నోట్లు

దేశంలో 2.15 లక్షల ఏటీఎంలలో 73 వేల ఏటీఎంలను నిర్వహిస్తున్న CMS ఇన్ఫోసిస్ట‌మ్స్ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2024 డిసెంబర్ చివరిలో 65% ఏటీఎంల‌లోనే చిన్న నోట్లు ల‌భించాయి. అయితే ఇప్పుడు ఈ సంఖ్య‌ను 73 శాతానికి పెంచారు.

Related Articles

Related image1
UPI Payments: ఫోన్‌పే, గూగుల్‌పే చేసే వారికి గుడ్ న్యూస్‌.. ఈరోజు నుంచి ఆ స‌మ‌స్యలేన‌ట్లే
Related image2
Hyderabad: ఈ ప్రాంతంలో భూమి కొంటే కోటీశ్వ‌రులు కావ‌డం ఖాయం.. మార‌నున్న హైద‌రాబాద్ ముఖ చిత్రం
35
నగదు లావాదేవీల్లో చిన్న నోట్లదే కీలక పాత్ర
Image Credit : our own

నగదు లావాదేవీల్లో చిన్న నోట్లదే కీలక పాత్ర

CMS సంస్థ క్యాష్ మేనేజ్‌మెంట్ ప్రెసిడెంట్ అనుష్ రాఘవన్ ఈ విష‌య‌మై మాట్లాడుతూ.. "దేశంలో ఇప్పటికీ 60% వినియోగదారుల ఖర్చులు నగదు రూపంలోనే ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100, రూ.200 నోట్లను అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకు రోజువారీ ఖర్చులు తేలికగా నెరవేరతాయి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిల్ల‌ర స‌మ‌స్య‌లు తీరుతాయిష అని చెప్పుకొచ్చారు.

45
90 శాతానికి పెంచేలా
Image Credit : our own

90 శాతానికి పెంచేలా

ఆర్బీఐ తాజాగా బ్యాంకుల‌కు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. 2025 సెప్టెంబర్ 30 నాటికి 75% ఏటీఎంలలో చిన్న నోట్లు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ సంఖ్య‌ను 2026 మార్చి 31 నాటికి 90 శాతానికి పెంచాల‌ని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు పెద్ద నోట్ల ఆధారిత ఏటీఎంల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను త‌గ్గించ‌డం కోసం తీసుకొచ్చారు.

55
గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రాధాన్యత
Image Credit : Freepik

గ్రామీణ ప్రాంతాల్లో మరింత ప్రాధాన్యత

చిన్న నోట్ల అవసరం ప్రధానంగా గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. అక్కడ ATM నుంచి రూ.500 లేదా రూ.2000 మాత్రమే వచ్చినప్పుడు చిల్ల‌ర స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. అలాంటి పరిస్థితుల్లో చిన్న నోట్లు ఉంటేనే ప్రజలకు సౌలభ్యం కలుగుతుంది. దీంతో కిరాణా, టిఫిన్ సెంటర్లు, చిన్న వ్యాపారాలు నగదుతో సజావుగా నడుస్తాయి.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved