MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ముగిసిన ఆర్‌బిఐ ఎం‌పి‌సి సమావేశం: వడ్డీ రేట్లలో కీలక నిర్ణయం.. వృద్ధి రేటు 9.5 శాతంగా అంచనా..

ముగిసిన ఆర్‌బిఐ ఎం‌పి‌సి సమావేశం: వడ్డీ రేట్లలో కీలక నిర్ణయం.. వృద్ధి రేటు 9.5 శాతంగా అంచనా..

ఆగస్టు 4న ప్రారంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బి‌ఐ)  ద్రవ్య విధాన కమిటీ (ఎం‌పి‌సి) సమావేశం నేడు ముగిసింది. కరోనా  రెండవ వేవ్ కారణంగా ఏప్రిల్, మేలో దేశంలోని చాలా ప్రాంతాల్లో విధించిన కఠినమైన ఆంక్షలు భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేశాయి. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Aug 06 2021, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇప్పుడు ఈ సమావేశం కరోనా థర్డ్ వేవ్ భయాల మధ్య చాలా ముఖ్యమైనది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ద్రవ్య విధాన కమిటీ ప్రతి రెండు నెలలకోసారి సమావేశమవుతుంది. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల గురించి చర్చిస్తారు. అలాగే వడ్డీ రేట్లు నిర్ణయించబడతాయి. రిజర్వ్ బ్యాంక్ చివరిసారిగా పాలసీ రేట్లను 22 మే 2020న సవరించింది.  
 

24

ముఖ్యమైన విషయాలు
ఆర్‌బిఐ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ఎప్పటిలాగే దీనిని 4 శాతంగా ఉంచారు. అంటే ఈ‌ఎం‌ఐ లేదా రుణల వడ్డీ రేట్లపై కస్టమర్లకు కొత్తగా  ఉపశమనం లభించలేదు.

మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎం‌ఎస్‌ఎఫ్) రేటు కూడా 4.25 శాతం వద్ద స్థిరంగా ఉంది.
రివర్స్ రెపో రేటు కూడా 3.35 శాతంగా స్థిరంగా ఉంచినట్లు శక్తికాంత దాస్ చెప్పారు.

దీనితో పాటు బ్యాంక్ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయకూడదని నిర్ణయించారు. ఇది 4.25 శాతంగా ఉంది.

34

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశ రియల్ జిడిపిలో 9.5 శాతం వృద్ధి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.
 
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జి‌డి‌పి 17.2 శాతంగా ఉంటుందని శక్తికాంత దాస్ అన్నారు.

ద్రవ్యోల్బణంపై  శక్తికాంత దాస్ 2021-2022 ఆర్థిక సంవత్సరంలో సిపిఐ 5.7 శాతంగా ఉండవచ్చని, గత సమావేశంలో దీనిని 5.1 శాతంగా అంచనా వేశారు.

రెండవ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5.9 శాతం, మూడో త్రైమాసికంలో 5.3, నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతం ఉండవచ్చు తెలిపారు.

 అలాగే 2022-2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సిపిఐ 5.1 శాతంగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. 

44

रिजर्व बैंक ऑफ इंडिया (RBI) ने सभी बैंकों को 30 सितंबर तक सभी ब्रांच में चेक ट्रंकेशन सिस्टम (CTS) लागू करने का निर्देश जारी किया है। RBI directions cheque truncation system will be applicable by 30 September MJA

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
India US Relations : తగ్గేదేలే ! రష్యా చమురుపై అమెరికాకు ఇండియా మాస్ వార్నింగ్
Recommended image2
Stock: కండోమ్ కంపెనీ కాసుల వర్షం కురిపించిందిగా.. రూ. లక్షను ఏకంగా రూ. 38 లక్షలుగా మార్చింది..
Recommended image3
రూ. 1,000 లోపు యూపీఐ సపోర్ట్ చేసే ఫోన్లు ఇవే.. కీప్యాడ్ మొబైల్ నుంచే ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved