MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఆర్బీఐ అలర్ట్: ఈ బ్యాంకులో మీ డబ్బులు ఉన్నాయా, అయితే సెప్టెంబర్ 22 తర్వాత విత్ డ్రా చేసుకోలేరు..ఎందుకో తెలుసా

ఆర్బీఐ అలర్ట్: ఈ బ్యాంకులో మీ డబ్బులు ఉన్నాయా, అయితే సెప్టెంబర్ 22 తర్వాత విత్ డ్రా చేసుకోలేరు..ఎందుకో తెలుసా

RBI మరో బ్యాంకుపై కొరడా ఝుళిపించింది. దివాళా తీసిన బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసి, ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడటమే ఆర్బీఐ లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో పూణేకు చెందిన ఓ సహకార బ్యాంకుపై ఆర్బీఐ చర్యలకు దిగింది.

2 Min read
Krishna Adhitya
Published : Sep 11 2022, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఖాతా దారుల డబ్బును కాపాడటమే లక్ష్యంగా RBI ఎప్పటికప్పుడు బ్యాంకుల పనితీరును సమీక్షిస్తుంటుంది. దివాళా తీయబోయే బ్యాంకులను గుర్తించి ఖాతాదారులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది. అంతే కాదు బ్యాంకులో డబ్బు దాచుకునే సామాన్యులు, ఖాతాదారుల ప్రయోజనాల కోసం ఆర్బీఐ అనేక చట్టాలను చేసింది. తద్వారా బ్యాంకు దివాళా తీసినప్పటికీ, ఖాతాదారుల సొమ్ము వారికి చేరేలా ఆర్బీఐ చేసిన చట్టం కాపాడుతుంది. 

25

అంతేకాదు సరైన నిర్వహణ లేని  బ్యాంకులకు జరిమానా లేదా లైసెన్స్ కూడా రద్దు చేస్తుంది. ఇదే చర్యతో రిజర్వ్ బ్యాంక్ మరో బ్యాంకు లైసెన్స్‌ను తాజాగా రద్దు చేసింది. పూణేకు చెందిన రూపి సహకరి బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ ఆగస్టు నెలలో రద్దు చేసింది. ఇప్పుడు RBI చర్య తీసుకున్న 1 నెల తర్వాత బ్యాంక్ తన వ్యాపారాన్ని మూసివేయవలసి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తర్వాత, ఈ బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ సేవలు సెప్టెంబర్ 22 నుండి మూసివేస్తారు. 

35

రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్ ప్రకారం, బ్యాంక్ మూసివేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 22. అప్పటి నుంచి బ్యాంకు తన వ్యాపారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో, బ్యాంకు ఖాతాదారులు డబ్బును డిపాజిట్ చేయలేరు, విత్‌డ్రా చేయలేరు. రూపీ సహకరి బ్యాంక్, బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు అమల్లోకి వస్తుంది. ఎందుకంటే బ్యాంక్ వద్ద తగినంత మూలధనం, ఆదాయ అవకాశాలు లేని కారణంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

45

రిజర్వ్ బ్యాంక్ నియమం ఇదే...
RBI ప్రకారం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 11(1), సెక్షన్ 22(3)(d) అలాగే సెక్షన్ 56 నిబంధనలకు అనుగుణంగా లేదు. సెక్షన్లు 22(3)(a), 22(3)(b), 22(3)(c), 22(3)(d), 22(3)(e) అవసరాలను పాటించడంలో బ్యాంక్ విఫలమైంది. DICGC చట్టం, 1961లోని నిబంధనలకు లోబడి, ప్రతి డిపాజిటర్లు రూ. 5,00,000 (ఐదు లక్షలు) వరకు డిపాజిట్ బీమా క్లెయిమ్ మొత్తాన్ని పొందేందుకు అర్హులు.

55

ఈ సహకార బ్యాంకుపై కూడా నిషేధం
కేరళలోని తొడుపుజా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులు తమ ఖాతాల నుండి డబ్బును విత్ డ్రా చేసుకోకుండా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధించింది. తొడుపుజా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా సెంట్రల్ బ్యాంక్ దానిపై అనేక ఆంక్షలు విధించింది. బ్యాంకు ఆర్థిక స్థితి క్షీణించడం వల్ల రుణదాతపై విధించిన అనేక పరిమితులలో భాగంగా ఈ చర్య తీసుకోబడింది. ఆగస్ట్ 23, 2022న వ్యాపారం ముగియడంతో ఈ మారటోరియం అమల్లోకి వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved