అమెరికాలో సెటిలైన బాలీవుడ్ బ్యూటీ.. ముంబైలోని ఆమె ఆస్తులు కోట్లకు విక్రయం.. గోవాలో ఇల్లు కూడా..
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు చెప్తే తెలియని వారు ఎవరు ఉండరు. హింది చిత్రాలతో పాటు హాలీవుడ్, వెబ్ సిరీస్ లో నటించిన ప్రియాంక చోప్రా పాపులర్ సింగర్ నిక్ జోనాస్ ను డిసెంబర్ 2018లో వివాహం చేసుకుంది. నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా జంట ప్రపంచంలోని అత్యంత పాపులర్ జంటలలో ఒకరు.
వివాహం తరువాత ప్రియాంక చోప్రా అమెరికాకు మకాం మార్చేశారు. అయితే కొద్దికాలం క్రితం ముంబైలోని ఆమే ఆస్తులను కోట్ల రూపాయలకు విక్రయించడంతో హాట్ టాపిక్ అయ్యింది. నివేదికలు ప్రకారం ప్రియాంక చోప్రాకు ముంబైలోని రెండు అపార్టుమెంట్లలో ఫ్లాటు ఉన్నాయి. అయితే వీటిని రూ .7 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ప్రియాంక చోప్రా ఈ ఏడాది మార్చిలో ఈ అమ్మకాలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుందని, దీనికి సంబంధించి వివరాలు ఇప్పుడు వెల్లడైనట్లు నివేదికలు తెలిపాయి.
మీడియా నివేదికల ప్రకారం, ప్రియాంక చోప్రాకు ముంబైలోని వెర్సోవా, అంధేరి (వెస్ట్)లోని రాజ్ క్లాసిక్ అపార్టుమెంట్ లోని ఏడవ అంతస్తులో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో ఒక ఫ్లాట్ ధర సుమారు నాలుగు కోట్లు, మరో ఫ్లాట్ ధర మూడు కోట్లు. అంతకుముందు ప్రియాంక చోప్రా లోఖండ్వాలా కాంప్లెక్స్, అంధేరి (వెస్ట్) లో కరణ్ అపార్టుమెంట్లో నాలుగవ అంతస్తులోని ఫ్లాట్ ని రూ .2 కోట్లకు విక్రయించింది.
ఈ ఏడాది జూన్లో ముంబైలోని ఓషివారాలో ఉన్న రెండవ అంతస్తులోని తన ఆఫీస్ కార్యాలనయాన్ని కూడా అద్దెకు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఆఫీస్ 2040 చదరపు అడుగులలో ఉంటుంది. దీన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ప్రియాంకకు సుమారు రూ .2.11 లక్షల అద్దె లభిస్తుంది.
ఇదొక్కటే కాదు ప్రియాంక చోప్రాకు ముంబైలోని జుహులో విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. ఇక్కడే నిక్ జోన్స్ తో ఎంగేజ్మెంట్ వేడుక కూడా జరిగింది. అలాగే గోవాలోని బాగా బీచ్ సమీపంలో ఆమెకి ఒక ఇల్లు కూడా ఉంది. ఒక నివేదిక ప్రకారం ప్రియాంక చోప్రా, నిక్ జోన్స్ నికర విలువ రూ .734 కోట్లు. ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీల జాబితాలో ప్రియాంక చోప్రా 14వ స్థానంలో నిలిచింది. అప్పుడు ఆమె వార్షిక ఆదాయం రూ .34.4 కోట్లు. 2019లో ప్రియాంక 'ది స్కై ఈజ్ పింక్' అండ్ 'ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్' అనే రెండు చిత్రాల్లో నటించింది. దీని తరువాత అతని సంపద మరింత పెరిగింది.
2020 సంవత్సరంలో ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్తంభించిపోయింది. ఆ సమయంలో బాలీవుడ్, హాలీవుడ్ సినిమా షూటింగులు నిలిచిపోయాయి కూడా. కానీ మార్చి 2021లో ఆమే న్యూయార్క్లో సోనా అనే ఇండియన్ రెస్టారెంట్ను ప్రారంభించింది.