MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Update KYC: ఏప్రిల్ 10 లోపు KYC అప్‌డేట్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయదు

Update KYC: ఏప్రిల్ 10 లోపు KYC అప్‌డేట్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయదు

Update KYC: బ్యాంకు ఖాతాదారులకు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఈ ఆదేశాలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. విషయం ఏంటంటే.. మీరు గాని మీ బ్యాంకు అకౌంట్ ను ఇప్పటి వరకు కేవైసీ అప్ డేట్ చేయించుకోకపోతే వెంటనే చేయించుకోండి. ఏప్రిల్ 10 వరకే గడువు ఉంది. ఈ తేదీ దాటిన తర్వాత మీ బ్యాంకు అకౌంట్ తాత్కాలికంగా స్తంభించిపోతుంది. ఏ బ్యాంకు అకౌంట్ హోల్డర్లు కేవైసీ అప్ డేట్ చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Naga Surya Phani Kumar
Published : Apr 07 2025, 03:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రిజర్వ్ బ్యాంక్ ఆదేశం ప్రకారం ఏప్రిల్ 10 లోపు ఓ గవర్నమెంట్ బ్యాంకు ఖాతాదారులు అందరూ వారి కేవైసీ వివరాలను అప్ డేట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆన్ లైన్ మోసాలు, సమాచారం దొంగిలించడం వంటి మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలను నివారించడానికి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఆదేశాలను జారీ చేసింది. దీనికి తుది గడువుగా ఏప్రిల్ 10వ తేదీని ఫిక్స్ చేసింది. 
 

25

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకు లో అకౌంట్ ఉందా? అయితే మీరు అర్జెంట్ గా కేవైసీ వివరాలను అప్ డేట్ చేయించుకోవాలి. సెక్యూరిటీ కారణాల నేపథ్యంలో అత్యవసరంగా కేవైసీ అప్ డేట్ చేయించాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేవైసీ అప్ డేట్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. 
 

35

ఖాతాదారులకు మెయిల్స్, మెసేజ్ లు..

రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇప్పటికే తమ ఖాతాదారులకు మెయిల్స్, మెసేజ్ లు పంపింది. కేవైసీ అప్ డేట్ చేయించుకోని అకౌంట్ హోల్డర్స్ తప్పకుండా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే అప్ డేట్ చేయించుకున్న వారు మళ్లీ ఇప్పుడు చేయక్కరలేదని కూడా చెప్పింది. 

 

45

మెయిల్ వచ్చిన వారు తప్పక చేయించుకోవాలి

పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉండి, ఇప్పటికే కేవైసీ అప్ డేట్ చేయించుకున్న వారు బ్యాంకు నుంచి మెయిల్ వస్తే మళ్లి చేయించుకోవాలి. అంటే కేవైసీ అప్ డేట్ చేయించినా అందులో తప్పులు ఉండటం వల్ల మళ్లీ కేవైసీ అప్ డేట్ చేయించాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు కొందరు కస్టమర్లకు మెయిల్స్ పంపింది. 
 

55

ఇప్పటికే పలుమార్లు ఛాన్స్ ఇచ్చిన ఆర్బీఐ..

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు తమ కస్టమర్లతో కేవైసీ అప్ డేట్ చేయించమని పలుమార్లు ఛాన్స్ ఇచ్చింది. అయితే ఇంకా ఆ బ్యాంకు ఖాతాదారులు చేయకపోవడంతో చివరి గడువుగా ఏప్రిల్ 10 వ తేదీని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 10 తర్వాత కేవైసీ అప్ డేట్ చేయని కస్టమర్ల అకౌంట్స్ ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంకు హెచ్చరించింది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved