MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • PF Interest: పీఎఫ్ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ నెలాఖ‌రులో అకౌంట్‌లోకి అద‌నంగా డ‌బ్బులు

PF Interest: పీఎఫ్ ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ నెలాఖ‌రులో అకౌంట్‌లోకి అద‌నంగా డ‌బ్బులు

PF Interest: కోట్లాది మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఎఫ్ వడ్డీ జమ ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేటుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 18 2026, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
2025 26 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ ఖరారు
Image Credit : Gemini AI

2025-26 సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ ఖరారు

పీఎఫ్ డిపాజిట్లపై 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఆమోదించగా, తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ కూడా తన అనుమతిని ఇచ్చింది. దీంతో వడ్డీ జమ ప్రక్రియను ప్రారంభించేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దేశవ్యాప్తంగా 7 కోట్లకు పైగా ఈపీఎఫ్ సభ్యులు ఈ నిర్ణయంతో లాభపడనున్నారు. వడ్డీ సొమ్ము సభ్యుల ఖాతాల్లో జమ అయిన తర్వాత వారి మొత్తం పీఎఫ్ సొమ్ము మరింత పెర‌గ‌నుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆమోద ప్రక్రియ ఎలా జరుగుతుంది?
Image Credit : Asianet News

ఆమోద ప్రక్రియ ఎలా జరుగుతుంది?

పీఎఫ్ వడ్డీ రేటును ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయిస్తుంది. అయితే ఆ నిర్ణయం అమలులోకి రావాలంటే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది అనుమతి తప్పనిసరి. ఈ ఏడాది కూడా అదే ప్రక్రియ అనుసరించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమావేశంలో 8.25 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించారు. అనంతరం ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఆమోదం రావడంతో సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేసేందుకు ఈపీఎఫ్ఓ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
మనిషి చర్మంలా మెత్తగా ఉండే 10 అడుగుల విగ్రహం, రాత్రుళ్లు సింహ గర్జనలు.. తెలంగాణలో మిస్టరీ ఆలయం
Related image2
గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
36
కొత్త డిజిటల్ వ్యవస్థతో వేగంగా క్రెడిట్
Image Credit : Asianet News

కొత్త డిజిటల్ వ్యవస్థతో వేగంగా క్రెడిట్

గతంలో పీఎఫ్ వడ్డీ సభ్యుల ఖాతాల్లో క‌నిపించ‌డానికి కొన్ని నెలలు పట్టేది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ తన డిజిటల్ వ్యవస్థను మరింత ఆధునీకరించింది. కొత్త సాంకేతిక వ్యవస్థ కారణంగా వడ్డీ లెక్కింపు, ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ వేగవంతమైంది. అధికారిక అనుమతులు పూర్తయిన వెంటనే దేశవ్యాప్తంగా సభ్యుల ఖాతాల్లో వడ్డీ మొత్తాలు నేరుగా జమ అయ్యే విధంగా వ్యవస్థను రూపొందించారు. దీంతో సభ్యులు ఎక్కువ కాలం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు.

46
వరుసగా మూడో ఏడాది అదే వడ్డీ రేటు
Image Credit : Social Media

వరుసగా మూడో ఏడాది అదే వడ్డీ రేటు

ఈసారి కూడా 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలుగా పీఎఫ్ వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు కనిపించాయి. 2021-22లో వడ్డీ రేటు 8.10 శాతానికి తగ్గి నాలుగు దశాబ్దాల్లో కనిష్ట స్థాయికి చేరింది. తర్వాత 2022-23లో 8.15 శాతానికి పెరిగింది. 2023-24లో 8.25 శాతానికి చేరిన వడ్డీ రేటు, అనంతర సంవత్సరాల్లో కూడా కొనసాగుతోంది. ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఈ రేటు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

56
పీఎఫ్ వడ్డీ రేట్ల ప్రయాణం ఎలా సాగింది?
Image Credit : X

పీఎఫ్ వడ్డీ రేట్ల ప్రయాణం ఎలా సాగింది?

ఈపీఎఫ్ వడ్డీ రేట్ల చరిత్రను పరిశీలిస్తే కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. 1970ల చివరలో 8 శాతం స్థాయిలో ఉన్న వడ్డీ రేటు, తరువాతి దశల్లో క్రమంగా పెరిగింది. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో 8.75 శాతం వరకు చేరగా, 2015-16లో 8.80 శాతం నమోదైంది. అనంతరం ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయి. కరోనా కాలంలో 8.10 శాతానికి పడిపోయిన రేటు, ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరిగి ప్రస్తుతం 8.25 శాతం వద్ద స్థిరపడింది. దీర్ఘకాలిక రిటైర్మెంట్ పొదుపులకు ఇది స్థిరమైన రాబడిని అందిస్తున్న పథకంగా కొనసాగుతోంది.

66
వడ్డీ జమ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
Image Credit : Twitter

వడ్డీ జమ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?

పీఎఫ్ సభ్యులు తమ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఉమాంగ్ (UMANG) యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా మిస్డ్ కాల్, ఎస్‌ఎంఎస్ సేవల ద్వారా పీఎఫ్ పాస్‌బుక్‌ను పరిశీలించవచ్చు. వడ్డీ జమ అయిన తర్వాత ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో హైక్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక శాఖ ఆమోదం పూర్తవడంతో ఈ నెలలోనే వడ్డీ క్రెడిట్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల్లో అదనపు మొత్తాన్ని త్వరలోనే చూడగలరు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Phonepe: మీ ఫోన్‌లో ఫోన్‌పే యాప్ ఉందా.. ఎక్కువ రోజులు వాడ‌క‌పోతే ఛార్జీలు త‌ప్ప‌వా.?
Recommended image2
Gold Rate Today: భారీ షాక్ ఇచ్చిన వెండి...స్థిరంగా కొనసాగుతున్న బంగారం
Recommended image3
Gold Prices: పసిడి ప్రియులకు ఇదే బెస్ట్ టైమ్..మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం
Related Stories
Recommended image1
మనిషి చర్మంలా మెత్తగా ఉండే 10 అడుగుల విగ్రహం, రాత్రుళ్లు సింహ గర్జనలు.. తెలంగాణలో మిస్టరీ ఆలయం
Recommended image2
గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved