MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వాహనదారులపై ఇంధన ధరల పిడుగు.. రోజురోజుకి షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు..

వాహనదారులపై ఇంధన ధరల పిడుగు.. రోజురోజుకి షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు..

 రెండు రోజుల విరామం తర్వాత నేడు ఇంధన ధరలు(fuel prices) మళ్ళీ పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం రికార్డు స్థాయికి చేరాయి. ఈ రోజు పెట్రోలు(petrol) ధరపై లీటరుకు 31-35 పైసలు, డీజిల్(diesel) ధర లీటరుకు 33-37 పైసలు పెరిగింది.ఈ నెల అక్టోబర్‌లో ఇప్పటివరకు 19 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి.

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Oct 27 2021, 11:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ధర, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ.107.94గా ఉంది, నిన్నటి ధర నుండి 35 పైసలు పెరిగింది. ఇదిలా ఉండగా రాజధాని నగరంలో డీజిల్ లీటరుకు 35 పైసలు పెరిగి రూ.96.67గా ఉంది.

మెట్రో నగరాల్లో ముంబై పెట్రోల్ ధర ఇప్పటికీ అత్యధికంగా ఉంది. ముంబైలో పెట్రోల్ లీటరు రూ.114 మార్కుకు చేరువవుతోంది ప్రస్తుతం లీటరు రూ.113.80కి విక్రయిస్తోంది. దేశ ఆర్థిక రాజధానిలో డీజిల్ ధర లీటరుకు రూ.104.75.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం నాటి ధరపై 34 పైసలు పెంపుతో లీటర్ డీజిల్‌ ధర  రూ. 99.78, లీటర్ పెట్రోల్‌ ధర  రూ.108.45కు వచ్చింది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.83, తమిళనాడు రాజధానిలో డీజిల్ రూ.100.92కి చేరుకుంది.

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.111.70 కాగా, హైదరాబాద్‌లో లీటరు ధర రూ.112.27గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌ రూ.102.60, రూ.105.46కి చేరింది.
 

33

ప్రధాన భారతీయ నగరాల్లో భోపాల్, జైపూర్‌లలో ఇంధనం ధరతో చాలా అధికంగా ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.62 కాగా, డీజిల్ లీటరుకు రూ.106.01గా ఉంది. జైపూర్‌లో పెట్రోల్ , డీజిల్ ధర వరుసగా రూ.115.21, లీటరుకు రూ.106.47.

ప్రభుత్వ ఆయిల్ రిఫైనర్ ప్రకారం ఆరు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. విలువ ఆధారిత పన్ను లేదా VAT కారణంగా ఇంధన ధరలు ప్రతి రాష్ట్రాలలో మారుతూ ఉంటాయి.

పెట్రోల్‌ రిటైల్‌ ధరలో 61 శాతం, డీజిల్‌పై దాదాపు 56 శాతం కేంద్ర, రాష్ట్ర పన్నులు ఉంటాయి. కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.32.9, డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్ సుంకం విధిస్తోంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?
Recommended image2
Today Gold Price: సామాన్యులకు గుడ్ న్యూస్: భారీగా దిగివచ్చిన పసిడి.. నేటి గోల్డ్ రేట్ ఎంతంటే?
Recommended image3
రిచ్ ఏరియాల్లో ఉండే దుకాణాల్లో క‌స్ట‌మ‌ర్లే క‌నిపించ‌రు.. కానీ ల‌క్ష‌ల్లో లాభాలు ఎలా వ‌స్తాయి.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved