స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు.. హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు ఎంతంటే ?
వరుసగా 15వ రోజు ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఇంధన ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. గత వారం పెట్రోల్ ధర 13 నుండి 15 పైసలు తగ్గించగా, డీజిల్ ధర 14-15 పైసలు తగ్గింది. కానీ ఇప్పటికీ ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర రూ .100 పైనే ఉంది.
నేడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 101.19 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ .88.62గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.26, డీజిల్ ధర రూ. 96.19, కోల్కతాలో పెట్రోల్ ధర రూ. 101.62 కాగా, డీజిల్ ధర రూ. 91.71. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96, డీజిల్ ధర రూ. 93.26గా ఉంది.
ఈ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ .100 దాటింది
మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో పెట్రోల్ ధర 100 దాటింది. ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉంది.
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవడానికి మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం మీరు ఆర్ఎస్పి, మీ నగర కోని టైప్ చేసి 9224992249 నంబర్కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఇంధన ధరలను - https://iocl.com/Products/PetrolDieselPrices.aspx చెక్ చేసుకోండీ
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తర్వాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.
ఈ పారామితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.
పదిహేను రోజుల క్రితం (ఆదివారం) స్వల్పంగా తగ్గాయి. అప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 19 పైసలు తగ్గి రూ.101.19కు, డీజిల్ పైన 15 పైసలు తగ్గి రూ.88.77 నుండి రూ.88.62గా చేరింది.
జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. గత నెల ఆగస్ట్ లో ధరలు ఒక్కసారి కూడా పెరగలేదు. పైగా డీజిల్, పెట్రోల్ ధరలు పలుమార్లు తగ్గాయి. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల నిలిచిపోయింది. ఆ తర్వాత పలుమార్లు పెరిగినప్పటికీ, జూలై మధ్య నుండి పెరుగుదలలేదు.