Multibagger stock: జస్ట్ 4 నెలల్లోనే, రూ. 1 లక్ష పెట్టుబడిని రూ. 45 లక్షలుగా మార్చిన స్టాక్ ఇదే..
Multibagger stocks ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా. అయితే కేవలం నాలుగు నెలల వ్యవధిలో రూ. 1 లక్ష పెట్టుబడిని, రూ. 45 లక్షలుగా మార్చిన స్టాక్ గురించి తెలుసుకుందాం.
ఈ ఏడాది ప్రారంభం నుంచి భారత స్టాక్ మార్కెట్ ఒత్తిడిలో పని చేస్తున్నాయి. అయితే, మార్కెట్ ఈ స్థిరమైన హెచ్చు తగ్గుల మధ్య, బలమైన రాబడిని ఇచ్చిన కొన్ని స్టాక్లు ఉన్నాయి. ప్రధాన మార్కెట్ ఇండెక్స్ BSE సెన్సెక్స్ గత నెలలో 2.3 శాతం పడిపోయింది. అలాగే గత 6 నెలల్లో దాదాపు 5.25 శాతం తగ్గింది. అయితే ఈ బలహీన మార్కెట్లోనూ కొన్ని కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు భారీ లాభాలను ఆర్జించారు. అటువంటి స్టాక్ లలో బరోడా రేయాన్ కార్పొరేషన్ లిమిటెడ్ (Baroda Rayon Corporation Ltd) ఒకటి. బిఎస్ఇలో లిస్టయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 4400 శాతం లాభపడింది.
4 నెలల్లో రూ.4 నుంచి రూ. 212 చేరుకున్న స్టాక్ ధర
శుక్రవారం బిఎస్ఇలో బరోడా రేయాన్ కార్పొరేషన్ షేరు (Baroda Rayon Corporation Ltd) 5 శాతం పెరిగి రూ.212.30 వద్ద ముగిసింది. కానీ ఈ ఏడాది జూన్ 1న కంపెనీ షేర్లు బీఎస్ఈలో లిస్టయిన సమయంలో దాని ధర రూ.4.64 మాత్రమే. గత 4 నెలల్లో, బరోడా రేయాన్ కార్పొరేషన్ స్టాక్ ధర సుమారు 4475.43 శాతం పెరిగింది.
1 లక్ష రూపాయలను 4 నెలల్లో రూ. 45 లక్షలు చేసింది
4 నెలల క్రితం ఎవరైతే పెట్టుబడి దారుడు రూ. 1 లక్ష పెట్టుబడిని కొనసాగించినట్లయితే, ఈ రోజు రూ. 1 లక్ష విలువ 4475.43 శాతం పెరిగి దాదాపు రూ. 45.75 లక్షలు అయ్యింది. అంటే కేవలం 5 నెలల్లో దాదాపు 45 లక్షల రూపాయల లాభం వచ్చిందన్నమాట.
గత నెలలో ఈ షేరు 164 శాతం లాభపడింది
బరోడా రేయాన్ షేరు (Baroda Rayon Corporation Ltd) గత నెలలో రూ.80.30 నుంచి రూ.212.30కి 164 శాతం పెరిగింది. ఈ విధంగా, ఈ స్టాక్ గత నెలలో పెట్టుబడిదారులకు 164.38 శాతం లాభాన్ని ఇచ్చింది. అంటే ఈ స్టాక్లో నెల రోజుల క్రితం కూడా ఇన్వెస్టర్ రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, అతని రూ. 1 లక్ష రూ. 2.64 లక్షలు పెరిగి ఉండేది.
కంపెనీ గురించి తెలుసుకోండి
బరోడా రేయాన్ కార్పొరేషన్ (Baroda Rayon Corporation Ltd) గుజరాత్లో ప్రధాన కార్యాలయం కలిగిన టెక్స్టైల్ కంపెనీ, వడోదర రాజకుటుంబానికి చెందిన సంగ్రామ్ సింగ్ గైక్వాడ్ దీనిని నిర్వహిస్తున్నారు. 1958లో ప్రారంభమైన ఈ కంపెనీని వడోదర మాజీ మహారాజు ఫతే సింగ్రావ్ గైక్వాడ్ స్వాధీనం చేసుకున్నారు. అతని మరణానంతరం సంగ్రామ్ సింగ్ గైక్వాడ్ కంపెనీని పర్యవేక్షిస్తున్నారు. అతని కుమారుడు ప్రతాప్ సింగ్ గైక్వాడ్ కంపెనీకి CEOగా ఉన్నారు. కంపెనీ విస్కోస్ ఫిలమెంట్ రేయాన్ నూలు, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బన్ డైసల్ఫైడ్, అకర్బన సోడియం సల్ఫేట్ నైలాన్ నూలు తయారీలో వ్యవహరిస్తుంది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.486.41 కోట్లుగా ఉంది.