భారీగా గ్యాస్ సిలిండర్ ధరల పెంపు.. నేటి నుంచే అమలు.. ఎంత పెరిగిందంటే ?
చమురు కంపెనీలు ప్రతి నెలా 1 తేదీన ఎల్జిపి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. తదనుగుణంగా ఎల్పిజి ధరలు మారుతూ ఉంటాయి. దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను నేడు రూ.43.5 పెంచారు. అయితే 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. కానీ పన్ను రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంది.

19కిలోల సిలిండర్ ధర అక్టోబర్ 1 నుండి ఢిల్లీలో రూ .1693 నుండి రూ .1736.50 కి పెరిగింది. కోల్కతాలో దీని ధర రూ .1805.50కు, ముంబైలో రూ .1685కు, చెన్నైలో రూ. 1867.50కి పెరిగింది. గత నెల సెప్టెంబరులో రూ .75 మేర పెరిగిన సంగతి మీకు తెలిసిందే.ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 884.5. కోల్కతాలో దీని ధర రూ .911. ముంబైలో కోసం రూ. 884.5, చెన్నైలో రూ. 900.5 గా ఉంది.
ఎల్పిజి సిలిండర్ని ఎలా బుక్ చేయాలి
ఎల్పిజి సిలిండర్ బుక్ చేయడానికి 8454955555 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వండి. అంతే కాకుండా మీరు వాట్సాప్ ద్వారా సిలిండర్లను కూడా బుక్ చేసుకోవచ్చు. రీఫిల్ అని టైప్ చేసి మీరు 7588888824 నంబర్కు మెసేజ్ చేయలీ దీంతో మీ సిలిండర్ బుక్ అవుతుంది. గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతుంది. సగటు అంతర్జాతీయ బెంచ్ మార్క్, విదేశీ మారకపు రేట్లలో మార్పులు వంటి అంశాల ద్వారా దీని ధర నిర్ణయించబడుతుంది.
సిఎన్జి -పిఎన్జి ధరలు కూడా పెరగవచ్చు
కేంద్ర ప్రభుత్వం సహజ వాయువు ధరను 62 శాతం పెంచింది. గురువారం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వులలో ఈ విషయం తెలియజేసింది. సమాచారం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు ధర పెరిగిన తర్వాత కేంద్రం ఈ చర్య తీసుకుంది.