సామాన్యులకు షాకిస్తు గ్యాస్ సిలిండర్ ధర మళ్ళీ పెంపు.. ఒక్క నెలలోనే 3 సార్లు..
భారతదేశంలో ప్రస్తుతం ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలు కలత చెందుతుంటే మరోవైపు నేడు ప్రభుత్వ చమురు కంపెనీలు సాధారణ ప్రజలకు షాకిస్తు ఎల్పిజి సిలిండర్ల ధరను పెంచాయి. ఈ నెలలో సిలిండర్ ధరలను పెంచడం మూడవసారి. చమురు కంపెనీలు ప్రతి నెలా ఎల్పిజి సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. ప్రతి రాష్ట్రా పన్ను ఆధారంగా ఎల్పిజి ధర తదనుగుణంగా మారుతుంది.
ఢీల్లీలో 14 కిలోల సబ్సిడీ లేని ఎల్పిజి సిలిండర్ పై ఇప్పుడు రూ. 25 పాయలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగదారులు ఢీల్లీలో ఒక సిలిండర్ కి రూ .794 చెల్లించాల్సి ఉంటుంది. అంతకుముందు వినియోగదారులకు కేవలం రూ .769 ధర వద్ద లభించింది. కోల్కతాలో దీని ధర రూ .795 నుంచి రూ .820 కు, ముంబైలో రూ .769 నుంచి రూ .794 కు, చెన్నైలో రూ .785 నుంచి రూ .810 కు పెరిగింది. ఈ ధరలను కంపెనీ అధికారిక వెబ్ సైట్లో ఇంకా అందించలేదు.
అంతకుముందు చమురు కంపెనీలు ఫిబ్రవరి 4న సిలిండర్ల ధరను 25 రూపాయలు, ఫిబ్రవరి 14న 50 రూపాయలు పెంచాయి. దీని తరువాత నేడు మళ్ళీ 25 రూపాయలు పెంచాయి. అంటే ఒకే నెలలోనే ఎల్పిజి సిలిండర్ ధర 100 రూపాయలు పెరిగింది. అలాగే గత మూడు నెలల్లో రూ .200 పెరిగింది. ఎల్పిజి సిలిండర్ 2020 డిసెంబర్లో రూ .100 పెరిగింది. జనవరి 2021లో ఎల్పిజి ధరలలో ఎటువంటి మార్పు లేదు.
గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం సబ్సిడీ
ప్రస్తుతం ప్రతి సంవత్సరంలో 14.2 కిలోల 12 సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. వినియోగదారులు ఏడాదిలో 12 కంటే ఎక్కువ సిలిండర్లు తీసుకోవాలనుకుంటే, వారు వాటిని మార్కెట్ ధర వద్ద కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరలను సావరిస్తారు. దీని ధరలు సగటు అంతర్జాతీయ బెంచ్మార్క్లు, విదేశీ మారక ధరలలో మార్పు వంటి అంశాలను నిర్ణయిస్తాయి.
ఈ ఎల్పిజి ధరల పెరుగుదల తరువాత న్యూ ఢీల్లీలో ఎల్పిజి గ్యాస్ ధర రూ .719 గా, కోల్కతాలో ఎల్పిజి ధర ఇప్పుడు రూ .745.50 గా, ముంబైలో ఎల్పిజి సిలిండర్ ధర రూ .719 గా, చెన్నైలో ఎల్పిజి గ్యాస్ ధర ఇప్పుడు సిలిండర్కు రూ .735 గా మారింది. బెంగళూరులో ఎల్పిజి ధర 722 రూపాయలు, చండీఘడ్ లో ఎల్పిజి ధర 728.50 రూపాయలుగా ఉండగా, హైదరాబాద్లోని వంట గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఎల్పిజి సిలిండర్ ధరకు రూ .771.50 చెల్లించాల్సి ఉంటుంది.