గుడ్ న్యూస్: కేవలం రూ.9కే వంట గ్యాస్ సిలిండర్.. బుకింగ్ చేసుకోవడానికి కొద్దిరోజులే అవకాశం..
దేశంలో ఎల్పిజి సిలిండర్ల ధరలు పెంపు సాధారణ ప్రజలను ఆందోలన కలిగిస్తుంది. ప్రస్తుతం ఢీల్లీలో ఒక ఎల్పిజి సిలిండర్ ధర రూ .809. మీరు గ్యాస్ సిలిండర్లను రూ.809 కన్నా తక్కువ ధరకు పొందలనుకునే వారు ఈ ఆఫర్ గురించి తెలుసుకోండి.
ప్రముఖ దేశీయ పేమెంట్ యాప్ పేటిఎం ఈ ఆఫర్ను వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. కొంతకాలంగా ఎల్పిజి ధరలు గణనీయమైన పెంపును నమోదు చేశాయి. అయితే ఇలాంటి సమయంలో పేటిఎం ఆఫర్ తో మీకు భారీ ఉపశమనం లభిస్తుంది.
ఈ ఆఫర్ గురించి పూర్తిగా తెలుసుకోండి
పేటిఎం ఈ క్యాష్బ్యాక్ ఆఫర్ కింద మీరు గ్యాస్ సిలిండర్లను బుక్ చేస్తే మీరు 800 రూపాయల వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఈ పేటిఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ 31 మే 2021 వరకు లభిస్తుంది. అంటే మీరు ఈ నెల మొత్తంలో ఎప్పుడైనా ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఆఫర్ నిబంధనలు, షరతులు
ఈ ఆఫర్ మొదటిసారి ఎల్పిజి సిలిండర్లు పేటిఎం ద్వారా బుక్ చేసే వినియోగదారులకు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఈ ఆఫర్ కింద మీరు సిలిండర్ బుక్ చేసి చెల్లించేటప్పుడు మీకు 800 రూపాయల క్యాష్బ్యాక్ విలువ కలిగిన స్క్రాచ్ కార్డు లభిస్తుంది. ఈ ఆఫర్ మొదటి ఎల్పిజి సిలిండర్ బుకింగ్ చేసే వారికి కూడా ఆటోమేటిక్ గా వర్తిస్తుంది. ఈ ఆఫర్ కనీసం రూ.500 పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే వర్తించవచ్చని షరతు ఉంది. క్యాష్బ్యాక్ మొత్తం రూ .10 నుంచి రూ .800 వరకు ఉంటుంది. మీరు ఈ స్క్రాచ్ కార్డును ఏడు రోజులలోపు ఓపెన్ చెయ్యాలి, లేదంటే ఆ తర్వాత మీరు దాన్ని ఉపయోగించలేరు.
ఈ ఆఫర్ను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో తెలుసుకొండి
మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మొదట మీరు మీ పేటిఎం యాప్ ఓపెన్ చేసి షో మోర్ పై క్లిక్ చేయండి. అక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్స్ పై క్లిక్ చేయండి. దీని తరువాత మీరు బుక్ సిలిండర్ ఆప్షన్ చూస్తారు. మీ గ్యాస్ ప్రొవైడర్ను ఇక్కడ ఎంచుకోండి. వినియోగదారులు బుకింగ్ చేయడానికి ముందు FIRSTLPG ప్రోమో కోడ్ను ఎంటర్ చేయాలి. దీని తరువాత స్క్రాచ్ కార్డు 24 గంటల్లో లభిస్తుంది, ఈ స్క్రాచ్ కార్డు వాలిడిటీ ఏడు రోజుల మాత్రమే తరువాత ముగుస్తుంది. తరువాత మీరు దానిని ఉపయోగించలేరు.
ప్రస్తుత ధర
ప్రస్తుతం ఢీల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్పిజి సిలిండర్ కోసం, వినియోగదారులు 809 రూపాయలు చెల్లించాలి. దీని ధర కోల్కతాలో రూ .83.50, ముంబైలో రూ .809, చెన్నైలో రూ .825.