MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Jio electric cycle: జియో నుంచి ఎలక్ట్రిక్‌ సైకిల్.. ఏకంగా 400 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు

Jio electric cycle: జియో నుంచి ఎలక్ట్రిక్‌ సైకిల్.. ఏకంగా 400 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు

టెలికం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో సంస్థ దాదాపు అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. దుస్తులు మొదలు పెట్రోల్‌ వరకు ప్రతీ రంగంలో జియో బ్రాండ్‌ ఉంటోంది. అయితే తాజాగా జియో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా పలు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

2 Min read
Author : Narender Vaitla
| Updated : Feb 28 2025, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
jio electric cycle

jio electric cycle

రియలన్స్ జియో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి జియో ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజువారీ ప్రయాణాలకు ఈ ఇ-బైక్‌ ఉపయోగపడనుందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు రిలయన్స్‌ ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సోషల్‌ మీడియా వేదికగా కొన్ని ఫీచర్లు, ధర వివరాలు వైరల్‌ అవుతున్నాయి. 
 

24

జియో ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను భారీ మైలేజ్‌తో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సైకిల్ ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్‌తో ఏకంగా 400 కిలోమీటర్లు దూసుకెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఎలక్ట్రిక్‌ సైకిల్‌ విభాగంలో ఇదొక బెంచ్‌ మార్క్‌గా చెబుతున్నారు. ఇందులో లిథియం అయాన్‌ బ్యాటరీ ఇవ్వనున్నారని సమాచారం. ఇక కేవలం 5 గంటల్లోనే ఈ సైకిల్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌ అవుతుందని సమాచారం. 
 

34

అంతేకాకుండా ఈ సైకిల్‌లో రిమూవబుల్ బ్యాటరీని ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్‌ సైకిల్‌లో 250 వాట్స్‌ నుంచి 500 వాట్స్‌ రిమూవబుల్ బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సౌకర్యవంతమైన రైడ్‌ కోసం ఇందులో స్మూత్ యాక్సిలరేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ వంటి మోడ్స్‌ను అందించారు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉపయోగిస్తే 3 నుంచి 5 గంటల్లో, నార్మల్‌ ఛార్జింగ్‌తో 6 నుంచి 8 గంటల్లో బ్యాటరీ ఫుల్‌ అయ్యేలా వీటిని రూపొందిస్తారని సమాచారం. 
 

44

అలాగే ఇందులో ఎల్‌ఈడీ లైట్‌, స్పీడ్‌తో పాటు బ్యాటరీ లెవల్స్‌ను చూపించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, GPS, బ్లూటూత్, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్‌తో స్మార్ట్ కనెక్టివిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ధర విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ సుమారు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ సైకిల్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate: షాకిస్తున్న బంగారం, వెండి రేట్లు, 2రోజుల్లో రూ.11,500 జంప్
Recommended image2
US Israel Iran Conflict : హర్మూజ్‌ దెబ్బ.. భారత్‌లో పెట్రోల్ రూ. 200 దాటుతుందా?
Recommended image3
Indian Railways: రైల్వే సూపర్ అనౌన్స్‌మెంట్.. రాత్రిపూట ట్రైనులో గట్టిగా మాట్లాడుతూ గోల చేస్తే భారీ జరిమానా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved