Infosys CEO:ఇన్ఫోసిస్ సిఈఓ సలీల్ పరేఖ్ జీతం ఎంతో తెలుసా.. ఏకంగా 88 శాతం పెంపు..
స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తిరిగి నియామకం తర్వాత రూ.79.75 కోట్ల జీతం చెల్లింపు జూలై 1 నుండి అమలులోకి వస్తుంది,

దీనికి సంబంధించి 5-పాయింట్లు
భారతదేశంలోని రెండవ అతిపెద్ద IT సేవల సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ బోర్డు సలీల్ పరేఖ్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా 1 జులై 2022 నుండి మార్చి 2027 వరకు అంటే ఐదు సంవత్సరాల కాలానికి తిరిగి నియమించాలని నిర్ణయించింది.
ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ ని 5-సంవత్సరాల పదవీకాలనికి తిరిగి నియమించాలని వాటాదారులు ఆమోదించిన తర్వాత అతనికి సంవత్సరానికి 79.75 కోట్లు జీతం చెల్లించాల్సి ఉంటుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, 2020-21లో రూ.49.68 కోట్ల నుండి దాదాపు 43 శాతం పెరిగి 2021-22 ఆర్థిక సంవత్సరంలో అతనికి రూ.71 కోట్ల జీతం చెల్లించబడుతుంది.
2021-22లో సలీల్ పరేఖ్ జీతం: స్టాక్ ఆప్షన్ల ఎకౌంట్లో రూ.52.33 కోట్లు, రిటైర్మెంట్ బెనెఫిట్స్ రూ.38 లక్షలతో సహా రూ.5.69 కోట్ల ఫిక్సెడ్ పేమెంట్, వేతనంలో వేరియబుల్ పే రూ.12.62 కోట్లు కూడా ఉన్నాయి .
సలీల్ పరేఖ్ జనవరి 2018 నుండి ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆరుగురు కీలక మేనేజ్మెంట్ సిబ్బందికి 104,000 షేర్లు, 88 మంది ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు మరో 375,760 షేర్లను మంజూరు చేయడానికి ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఆమోదం ఫలితంగా సలీల్ పరేఖ్ పరిహారాన్ని పెంచారు. .
కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని స్వచ్ఛందంగా కంపెనీకి అందించిన సేవలకు ఎలాంటి పారితోషికం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.