MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • డిసెంబర్ నాటికి రూపాయి విలువ డాలర్‌కి రూ.74కి చేరుకుంటుంది: నిపుణులు

డిసెంబర్ నాటికి రూపాయి విలువ డాలర్‌కి రూ.74కి చేరుకుంటుంది: నిపుణులు

భారత రూపాయి బుధవారం అంటే నేటి నుండి  డిసెంబర్ చివరి నాటికి డాలర్‌కు రూ.74 వరకు అంటే 2% లాభపడవచ్చు. చమురు ధరల పెరుగుదలతో కుప్పకూలిన భారీ షేర్ల అమ్మకాల వెనుక విదేశీ ప్రవాహం  భారత రూపాయికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. 

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Oct 14 2021, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బ్లూమ్‌బెర్గ్ సర్వే ప్రకారం గత నెలలో ఆసియాలో అత్యంత   వరస్ట్ పర్ఫర్మర్ గా మారిన కరెన్సీ బుధవారం నాటికి డాలర్‌కు రూ.74కి దగ్గరగా ఉంది. వారెన్ బఫెట్-ఆధారిత పేటి‌ఎంతో సహా డిజిటల్ కంపెనీలు ఇనీషియల్ షెర్స్ సేల్స్ లో సుమారు $ 10 బిలియన్లను పెంచాలని యోచిస్తున్నందున భారీ ప్రవాహాలు భారతీయ తీరాలకు దారి తీయవచ్చు.

25

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం, నికర చమురు దిగుమతి చేసుకునే దేశం ఆర్ధిక ఆరోగ్యం గురించి చింతించడంతో రూపాయి ఒత్తిడికి గురైంది.  

"చారిత్రాత్మకంగా ముడిచమురు ధర పేరుగుతున్నప్పటికి ఈక్విటీలు స్లగ్గిష్ ఉన్నాయి, కాబట్టి రూపాయికి ప్రతిదీ ప్రతికూలంగా మారింది" అని ఎడెల్‌వీస్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఫారెన్ ఎక్స్ఛేంజ్ అండ్  రేట్స్ ట్రేడింగ్ హెడ్ సాజల్ గుప్తా అన్నారు. కానీ ఈసారి "ఐ‌పి‌ఓల స్లేట్ అధిక ముడి ధరల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాలి." అని కూడా తెలిపారు.
 

35

కరెన్సీ నష్టాలను అదుపు చేయడానికి ఆర్‌బిఐ సున్నితమైన జోక్యం చేసుకోవడం వ్యాపారులను ఆశ్చర్యపరిచింది. సెప్టెంబర్ ప్రారంభం నుండి రూపాయి 3% క్షీణించింది. ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ ప్రై. రూపాయి అధిక విలువను సరిదిద్దడానికి ఉద్దేశించిన నష్టాలను ఆర్‌బిఐ అనుమతించి ఉండవచ్చునని చెప్పారు. 

అందుకే ఆర్‌బి‌ఐ "డాలర్లను విక్రయించడం ద్వారా దూకుడుగా జోక్యం చేసుకోలేదు" అని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అభిషేక్ గోయెంకా అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి డాలర్‌కు 73.90-76.90 వరకు ట్రేడ్ చేయడానికి ఆర్‌బిఐ అనుమతించవచ్చని ఆయన చెప్పారు. 

45

అధిక చమురు ధరలు వేగంగా కోలుకుంటున్న స్థానిక డిమాండ్ దిగుమతులను పెంచాయి, సెప్టెంబరులో భారతదేశ వాణిజ్య లోటును ఎన్నడూ లేనంతగా పెంచింది. చమురు దిగుమతులు దాదాపు 200%పెరిగాయి.

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 445.8 మిలియన్ డాలర్లను అందుకున్న తర్వాత అక్టోబర్‌లో ఇప్పటివరకు భారతదేశానికి స్టాక్స్‌లోకి $ 100 మిలియన్ విలువైన విదేశీ ప్రవాహాలు వచ్చాయి. అంతేకాకుండా డిజిటల్ చెల్లింపులలో దేశంలో అగ్రగామిగా ఉన్న పేటీఎం, వాల్‌మార్ట్ ఇంక్ ద్వారా నియంత్రించబడే భారతీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా నాల్గవ త్రైమాసికంలో ఐ‌పి‌ఓ కోసం లక్ష్యంగా పెట్టుకుంది.
 

55

"ఇన్‌ఫ్లోలురూపాయికి మద్దతుగా ఉంటాయి, ముఖ్యంగా శక్తివంతమైన ఐ‌పి‌ఓల మధ్య" అని ఆస్ట్రేలియా & న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ లిమిటెడ్‌లో ఫారెన్ ఎక్స్ఛేంజ్ స్ట్రటేజీస్ట్ ధీరాజ్ నిమ్ అన్నారు. "కీ డ్రైవర్ ఆర్‌బిఐ విధానం కావచ్చు. ప్రవాహాలు నిలకడగా ఉంటాయని భావించి, దేశీయ లిక్విడిటీ నిర్వహణతో పాటుగా, ఆర్‌బిఐ ఎఫ్‌ఎక్స్ కొనుగోళ్లను నిర్వహించాలి అని తెలిపారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved