MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • క్రిప్టోకరెన్సీని నిషేధించడం కాదు, రెగ్యులేటరి రూపొందించడం అవసరం.. : ఐ‌ఎం‌ఎఫ్ చీఫ్

క్రిప్టోకరెన్సీని నిషేధించడం కాదు, రెగ్యులేటరి రూపొందించడం అవసరం.. : ఐ‌ఎం‌ఎఫ్ చీఫ్

భారతదేశంలో ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ(cryptocurrency) అతిపెద్ద సమస్యగా మిగిలిపోయింది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక బిల్లును కూడా సిద్ధం చేసింది. అయితే ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించడం కష్టంగా కనిపిస్తుంది. 

2 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : Dec 16 2021, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇదిలా ఉండగా క్రిప్టోకరెన్సీలకు సంబంధించి భారత్‌లో కొనసాగుతున్న ఆందోళనలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బదులు దానిని నియంత్రణలోకి తీసుకురావడం చాలా ముఖ్యమని అన్నారు. 

గ్లోబల్ పాలసీ
ఐ‌ఎం‌ఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీత మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలు క్రిప్టోకరెన్సీలను నిషేధించకుండా రెగ్యులేట్ చేయాలని అన్నారు. దీనిపై గ్లోబల్ పాలసీ కూడా రూపొందించాలని సూచించారు. ఒక కార్యక్రమంలో గోపీనాథ్ ప్రసంగిస్తూ.. నిషేధించే విధానంలో చాలా సవాళ్లు ఉన్నాయని అన్నారు. మీరు నిజంగా క్రిప్టోను నిషేధించగలరా, ఎందుకంటే చాలా ఎక్స్ఛేంజీలు ఆఫ్‌షోర్‌లో ఉన్నాయి అలాగే అవి ఏదైనా నిర్దిష్ట దేశం నిబంధనలకు లోబడి ఉండవు. 

24

క్రిప్టోకరెన్సీ లావాదేవీలకు సంబంధించి
గ్లోబల్ పాలసీ కోసం వాదిస్తూ సరిహద్దులో క్రిప్టోకరెన్సీ లావాదేవీలు సులభంగా నిర్వహించవచ్చని, ఏ దేశమూ ఈ సమస్యను స్వయంగా పరిష్కరించుకోదని గీతా గోపీనాథ్ అన్నారు. దీనిపై గ్లోబల్ పాలసీ తక్షణావసరం అని అన్నారు. క్రిప్టోకరెన్సీలు ప్రస్తుతానికి ప్రపంచ ముప్పు కాదని ప్రధాన ఆర్థికవేత్త చెప్పారు. కానీ రెగ్యులేటర్ లేకుండా, ఈ వ్యాపారం గురించి చాలా భయాలు ఉన్నాయి, వీటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. 

34

భారత్‌తో చాలా సన్నిహిత సంబంధాలు 
49 ఏళ్ల ప్రముఖ భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త 2019 జనవరిలో ఐ‌ఎం‌ఎఫ్ ప్రధాన ఆర్థికవేత్తగా చేరారు. మైసూర్‌లో జన్మించిన గోపీనాథ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌కి మొదటి మహిళా చీఫ్ ఎకనామిస్ట్. గీతా గోపీనాథ్ అగ్రగామి ఆర్థికవేత్తలలో ఒకరు అలాగే అంతర్జాతీయ ఫైనాన్స్ అండ్ మాక్రో ఎకోనోమిక్స్  పై పరిశోధనలకు కూడా ప్రసిద్ది చెందారు. అంతేకాకుండా 2019 సంవత్సరంలో ఆమేకి ప్రవాసీ భారతీయ సమ్మాన్ ఇచ్చారు. ఆమె 2019 సంవత్సరం నుండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌తో కలిసి పనిచేస్తున్నారు ఇంకా ఇటీవలే గీతా గోపీనాథ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులయ్యారు. 
 

44

క్రిప్టోకరెన్సీ కోసం ఆర్‌బిఐ సన్నాహాలు 
క్రిప్టోకరెన్సీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు ముమ్మరం చేసింది. డిసెంబర్ 17న లక్నోలో ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో క్రిప్టోకరెన్సీలపై సీరియస్‌గా చర్చించే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. క్రిప్టోను రెగ్యులేటరీ పరిధిలోకి తీసుకురావడంపై ఆర్‌బిఐ చాలా జాగ్రత్తగా ఉందని ఇంకా చిన్న పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ క్రిప్టోకరెన్సీల దుర్వినియోగం పట్ల ఆందోళన ఉందని  ఒక నివేదిక పేర్కొంది. ఈ అంశాలను కేంద్ర బోర్డు సమావేశంలో తీవ్రంగా పరిగణిస్తారని విశ్వసనీయ సమాచారం. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ చిన్న ఇన్వెస్టర్ల వాటా పెరగడం, దాని ధరలలో అస్థిరత ఆందోళన కలిగిస్తున్నాయని చాలాసార్లు నొక్కి చెప్పారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
India US Relations : తగ్గేదేలే ! రష్యా చమురుపై అమెరికాకు ఇండియా మాస్ వార్నింగ్
Recommended image2
Stock: కండోమ్ కంపెనీ కాసుల వర్షం కురిపించిందిగా.. రూ. లక్షను ఏకంగా రూ. 38 లక్షలుగా మార్చింది..
Recommended image3
రూ. 1,000 లోపు యూపీఐ సపోర్ట్ చేసే ఫోన్లు ఇవే.. కీప్యాడ్ మొబైల్ నుంచే ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్.!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved