Today Gold Rate: అక్షయ తృతీయ ఎఫెక్ట్ ..పెరుగుతున్న బంగారం ధరలు..ఇప్పుడు ఎంతుందో తెలుసా?
Today Gold Rate: అక్షయ తృతీయ నేపథ్యంలో పసిడి ప్రియులకు షాక్ తగిలింది. రెండురోజులుగా బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బంగారం కొట్లు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్ లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఇన్వెస్టర్లకు ఉపశమనం
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మార్కెట్లు జోరందుకోవడంతో ఇన్వెస్టర్లకు ఉపశమనం దొరికింది. వెంటనే బంగారం పై పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
రూ.1,55,350కు చేరిన మేలిమి బంగారం
బంగారం తగ్గిందనుకునేలోపే మరోసారి ధరలు ఎగబాకాయి. 24 క్యారెట్లపై దాదాపు రూ.1,420, 22 క్యారెట్లపై రూ.1,300 మేర పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ఇప్పడు రూ.1,55,350కు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,200కు పెరిగింది. విజయవాడ, విశాఖ, చెన్నై, ముంబయి ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
ఇప్పుడిప్పుడే యుద్ధం ముగిసే పరిస్థితి కనిపించకపోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. పరిస్థితి చూస్తుంటే...రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పసిడి, సిల్వర్..రేట్లు చూసి పసిడి ప్రియులు, కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అసలే అక్షయ తృతీయ...గ్రాము బంగారమన్నా కొనాలన్న సాంప్రదాయం. దానికి తోడు పెళ్లిళ్ల సీజన్. ఈ సమయంలో బంగారం కొనాలా? వద్దా? అని సందేహంలో ఉన్నారు.
అక్షయ తృతీయ ఎఫెక్ట్
అక్షయతృతీయ సీజన్ లో బంగారం షాపులు కళకళలాడాల్సింది పోయి ధరలు పెరగడంతో...కొనుగోలుదారులు రావడం లేదు. దీంతో జ్యూవెలరీ షాపులు వెలవెలబోతున్నాయి. యుద్ధం ముగిసే అవకాశాలు లేవు కాబట్టి. ఇలాంటి సమయంలో బంగారం పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. తగ్గే అవకాశాలను కొట్టిపారేయలేం. కాబట్టి...నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

