MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మగాళ్లపై మరింత భారం మోపనున్న మోదీ సర్కార్ ... వీటి ధరలు పెరగనున్నాయ్

మగాళ్లపై మరింత భారం మోపనున్న మోదీ సర్కార్ ... వీటి ధరలు పెరగనున్నాయ్

వస్తు సేవల పన్ను (జిఎస్టి) మరోసారి పెరగనుంది. కొన్ని వస్తువులపై జిఎస్టి పెంపుకు మంత్రుల బృందం రికమెండ్ చేసింది. జిఎస్టి కౌన్సిల్ ఆమోదం లభిస్తే ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇంతకూ ధరలు పెరిగే వస్తువులేవో తెలుసా? 

2 Min read
Arun Kumar P
Published : Dec 03 2024, 06:13 PM IST| Updated : Dec 03 2024, 06:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
GST Hike

GST Hike

GST Hike : ఇప్పటికే ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతోంది. నిత్యావసరాల నుండి లగ్జరీ వస్తువుల వరకు ప్రతి ఒక్కటీ రోజురోజుకు మరింత ప్రియం అవుతున్నాయి. పెరుగుతున్న ధరలు పేద,మద్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయి... ఏది కొందామన్నా జేబుకు చిల్లు తప్పడం లేదు. ఇలా ఇప్పుడున్న ధరలతోనే సతమతం అవుతున్న సామాన్యులపై మరోసారి ధరల భారం పడనుంది. మరీముఖ్యంగా పురుషులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై జిఎస్టి (వస్తు సేవల పన్ను) పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుంది. 

23
GST Hike

GST Hike

ధరలు పెరిగే వస్తువులివే :  

కొన్ని వస్తువులపై ధరల పెంపుకు జిఎస్టి ప్యానల్ రికమెండ్ చేస్తోంది. కొన్ని రకాల శీతల పానియాలతో పాటు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జిఎస్టి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీటిపై 28 శాతంగా వున్న జిఎస్టిని 35 శాతానికి పెంచాలని జిఎస్టి ప్యానల్ రికమెండ్ చేస్తోంది. ఈ మేరకు బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన సమావేశమైన జివోఎం నిర్ణయం తీసుకుంది. 

వీటితోపాటు రెడిమేడ్ గార్మెంట్స్, సైకిళ్లు, రిస్ట్ వాచెస్ పై కూడా ట్యాక్స్ రివిజన్ చేయాలని సూచించారు. అంటే రూ.1,500 లోపు గార్మెంట్స్ పై 5 శాతం, ఆపై విలువగల రెడీమేడ్ గార్మెంట్స్ పై 18 నుండి 28 శాతం జిఎస్టి  పెంచాలని రికమండ్ చేసారు.ఇలా కొత్తగా 148 ఉత్పత్తులపై పన్ను పెంచాలని జివోఎం సూచించింది. 
 

33
GST Hike

GST Hike

జిఎస్టి కౌన్సిల్ ఏం చేస్తుందో... 

జఎస్టి ప్యానల్ రికమండేషన్స్ పై ఈ నెల అంటే డిసెంబర్ 21 జరగనున్న జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్టి కౌన్సిల్ సమావేశం కానుంది. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొంటారు. 

మంత్రుల బృందం జిఎస్టి పెంపు రికమండేషన్స్ పై ఈ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఏ వస్తువులపై జిఎస్టి పెంపుకు ఆమోదం తెలుపుతారో వాటి ధరలు పెరుగుతాయి. దీంతో జిఎస్టి కౌన్సిల సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపనున్నాయి. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved