ఎయిర్ ఇండియాలో కరోనా కల్లోలం: కోవిడ్-19తో నేటికీ 56 మంది మృతి.. కుటుంబాలకు నష్టపరిహారం..
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా జూలై 14 వరకు 56 మంది ఎయిర్ ఇండియా ఉద్యోగులు మరణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ గురువారం చెప్పారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఆయన ఈ సమాచారం ఇచ్చారు.
కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా ఎయిర్ ఇండియాలో దాదాపు 3,523 ఉద్యోగులకు సోకిందని తెలిపారు. 14 జూలై 2021 నాటికి వీరిలో 56 మంది ఉద్యోగులు మరణించారు. కోవిడ్ -19 బాధిత ఉద్యోగులు, వారి కుటుంబాల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఎయిర్ ఇండియా అనేక చర్యలు తీసుకుందని మంత్రి వి.కె.సింగ్ చెప్పారు. కోవిడ్ కారణంగా శాశ్వత ఉద్యోగి మరణిస్తే ప్రతి కుటుంబానికి రూ .10 లక్షల పరిహారం ఇస్తున్నట్లు చెప్పారు.
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. గత ఒక్క రోజులో దేశంలో కొత్తగా 41,383 కోవిడ్ -19 కేసులు నమోదవడంతో మొత్తంగా కరోనా ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య 3,12,57,720కు చేరుకోగా, చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 4,09,394 గా నమోదైంది. ఈ వ్యాధితో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య వరుసగా రెండవ రోజు పెరుగుదల నమోదైంది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) భారతదేశంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య విమానాల ప్రయాణాన్ని 31 జూలై 2021 వరకు పొడిగించింది. ఈ పరిమితి అంతర్జాతీయ ఆల్-కార్గో కార్యకలాపాలకు, ప్రత్యేకంగా ఏవియేషన్ రెగ్యులేటర్ ఆమోదించిన విమానాలకు వర్తించదు. ఎంచుకున్న దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం ప్రస్తుతం షెడ్యూల్ చేసిన విమానాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి.
ఇటీవల డిజిసిఎ మాట్లాడుతూ విమానాశ్రయ నిర్వాహకులందరూ విమానాశ్రయం సందర్శించే ప్రజలు మస్కూలు సరిగ్గా ధరించార లేదా అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు విమానాశ్రయ ప్రాంగణంలో కూడా సురక్షితమైన భౌతిక దూరాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
అలాగే ఇన్స్టంట్ చెకింగ్ నిర్వహించాలని డిజిసిఎ విమానయాన సంస్థలను ఆదేశించింది. ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న నిబంధనలను విమానయాన సంస్థలు పాటించకపోతే, వారికి కూడా జరిమానా విధించవచ్చు. అలాగే, ఒక వ్యక్తి పదే పదే విమానాశ్రయ హెచ్చరికలు పాటించకపోతే, అతన్ని 'వికృత చేష్టలు చేసే ప్యాసెంజర్'గా పరిగణిస్తారు.