Today Gold Rate: పసిడి ప్రియులకు భారీ షాక్..పెరిగిన బంగారం, వెండి
Today Gold Rate: ఇవాళ బంగారం కొనాలా? లేక ఇంకాస్త వేచి చూడాలా? జనవరి ఆల్ టైమ్ హైతో పోలిస్తే ఇప్పటి ధరలు ఎంత తగ్గాయో తెలుసా? అయితే ఇవాళ పసిడి ధరలు కాస్త పెరిగాయి.

స్వల్పంగా పెరిగిన బంగారం
ఈరోజు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.220 పెరిగి రూ.1,50,660కి చేరింది. అలాగే 22 క్యారట్ బంగారం రూ.200 పెరిగి రూ.1,38,100గా నమోదైంది. 18 క్యారట్ బంగారం కూడా రూ.160 పెరిగి రూ.1,12,990కి చేరింది. వెండి విషయానికి వస్తే… గత రెండు రోజుల్లో భారీగా పడిపోయిన ధరలు ఈరోజు కొంత కోలుకున్నాయి. కిలో వెండి ధర సుమారు రూ.5000 పెరిగి రూ.2,65,000గా ఉంది. తులం వెండి ధర రూ.2,650 వద్ద లభిస్తోంది.
వెండిపై భారీ తగ్గుదల
ప్రస్తుతం ధరలు పెరిగినట్టు కనిపించినా, జనవరి 29న ఆల్ టైమ్ హైతో పోలిస్తే బంగారం, వెండి ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. అప్పుడు 24 క్యారెట్ బంగారం రూ.1,78,850 ఉండగా, ఇప్పుడు రూ.1,50,660కి పడిపోయింది. అంటే రూ.28,190 తగ్గింది. 22 క్యారెట్ బంగారం కూడా అప్పటి రూ.1,63,950 నుంచి ఇప్పుడు రూ.1,38,100కి తగ్గి రూ.25,850 నష్టపోయింది. జనవరి 29న కిలో వెండి రూ.4,25,000 ఉండగా, ఇప్పుడు రూ.2,65,000కి పడిపోయి సుమారు రూ.1,60,000 భారీ తగ్గుదల కనిపిస్తోంది.
బంగారంపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా తగ్గకపోవడం వల్ల మార్కెట్లో అస్థిరత కొనసాగుతోంది.
నిపుణుల సూచన
భారతదేశంలో బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, ఒక సంప్రదాయం కూడా. పెళ్లిళ్లు, పండుగల సమయంలో డిమాండ్ పెరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు మారుతూ ఉండటంతో, ఇన్వెస్టర్లు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించినా… దీర్ఘకాల ట్రెండ్ ఇంకా అస్థిరంగానే ఉంది. కాబట్టి త్వరపడకుండా మార్కెట్ను గమనిస్తూ ముందుకు వెళ్లడం ఉత్తమం.

