భగ్గుమంటున్న ఇంధన ధరలు.. నేడు పెట్రోల్, డీజిల్ ధర మళ్ళీ పెంపు..
న్యూ ఢీల్లీ: చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి ఇంధన ధరలను పెంచడంతో పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండు రోజుల పాటు స్థిరంగా ఇంధన ధరలు నేడు వాహనదారులపై ఇంధన భారాన్ని పెంచడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు ఢీల్లీలో పెట్రోల్ ధరను లీటరుకు 25 పైసలు పెంచడంతో రూ.85.20 నుంచి రూ .85.45 కు చేరింద, ఢిల్లీలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక రేటు. డీజిల్ ధర కూడా 25 పైసలు పెరగడంతో లీటరుకు రూ .75.63కు పెరిగింది. ముంబైలో డీజిల్ ధర లీటరుకు 91.80 రూపాయలకు చేరుకోవడంతో నేడు కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది.
22 జనవరి 2021న దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో డీజిల్, పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి..
నగరం పెట్రోల్ డీజిల్
ఢీల్లీ 85.45 75.63
ముంబై 92.04 82.40
చెన్నై 88.07 80.90
కోల్కతా 86.87 79.23
హైదరాబాద్ 88.89 82.53
4 అక్టోబర్ 2018 న పెట్రోల్ ధర అత్యధికంగా లీటరుకు రూ.84ను తాకింది. డీజిల్ ధర కూడా ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో లీటరుకు రూ.75.45 రూపాయలకు చేరుకుంది. ఆ సమయంలో ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి, వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడానికి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 1.50 రూపాయలు తగ్గించింది. దానితో పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు లీటరుకు మరో రూ.1 తగ్గించారు.
గత ఏడాది మే 2020 నుండి పెట్రోల్ ధర లీటరుకు రూ.14.28, డీజిల్ రూ .11.83 పెరిగినట్లు చమురు కంపెనీల ధరల నోటిఫికేషన్లు తెలిపాయి.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఉదయం 11:27 గంటలకు 3 సెంట్లు పడిపోయి 56.05 డాలర్లకు చేరుకుంది. యు.ఎస్. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 14 సెంట్లు పడిపోయి 53.17 డాలర్లకు చేరినట్లు ఒక నివేదిక తెలిపింది.