EPFO 3.0: జూన్ నుంచి ఏటీఎంలో కూడా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. కానీ.. ఆ కార్డు ఉండాలి
EPFO 3.0: EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇకపై ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతా నుండి డబ్బును సులభంగా తీసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం EPFO 3.0 పథకాన్ని ప్రకటించింది. అంటే ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎం, యూపీఐ ద్వారా ఉపసంహరించుకోవచ్చన్న మాట.
- FB
- TW
- Linkdin
Follow Us
)
అమలులోకి రానున్న EPFO 3.0!
గతంలో ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుండి డబ్బును విత్ డ్రా చేయాలంటే అనేక ఇబ్బందులు ఉండేవి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుండి డబ్బును సులభంగా తీసుకొనేందుకు వీలుగా ఈపీఎఫ్ఓ కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఇవి జూన్లో అమలులోకి రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ 3.0 (EPFO 3.0) అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ప్రకారం ఏటీఎం నుండి డబ్బును తీసుకున్నట్టుగానే ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
EPFO 3.0 లో సదుపాయాలివి..
ప్రస్తుతం EPFO సభ్యులు ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును ఉపసంహరించుకోవడానికి 10 నుండి 15 రోజుల వరకు పడుతుంది. కానీ పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడానికి కొత్త ఏటీఎం, యూపీఐ సదుపాయాలు ఉపయోగించుకోవచ్చు. ప్రారంభించిన తర్వాత పీఎఫ్ డబ్బు తీసుకోవడం నిమిషాల్లో పూర్తవుతుంది. అంతేకాకుండా EPFO 3.0 ద్వారా ఖాతా సవరణ, ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్, ఫిర్యాదుల తక్షణ పరిష్కారం వంటి అనేక సేవలు డిజిటల్గా అందుబాటులోకి వస్తాయి.
ఎప్పుడు ప్రారంభం?
EPFO 3.0 వ్యవస్థ జూన్ 2025లో ప్రారంభిస్తామని కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ఇది 9 కోట్లకు పైగా పీఎఫ్ ఖాతాదారులకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడానికి రూపొందించారు.
ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బు తీసుకోవడానికి EPFO సభ్యులకు కొత్త EPF ఉపసంహరణ కార్డ్ అందజేస్తారు. డెబిట్ కార్డ్ లాగానే ఈ కార్డ్ ద్వారా బ్యాలెన్స్ చెక్, డబ్బు ఉపసంహరణ వంటివి చేసుకోవచ్చు.
ఎంత డబ్బు తీసుకోవచ్చు?
ఏటీఎం, యూపీఐ ద్వారా మాక్సిమం రూ.1 లక్ష వరకు ఉపసంహరించుకోవచ్చు. దీనివల్ల పని దినాల్లో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సమయం వృధా కావడం ఉంటుంది. అంతేకాకుండా కొత్త వ్యవస్థలో పీఎఫ్ క్లెయిమ్ ప్రక్రియ ఆటోమేటిక్గా (ఆటో మోడ్) జరిగేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
అకౌంట్ డీటైల్స్ ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు
EPFO 3.0 సిస్టమ్ లో సభ్యులు తమ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, శాశ్వత చిరునామా వంటి వివరాల్లో ఏవైనా లోపాలుంటే ఆన్లైన్ ద్వారా వెంటనే సవరించుకోవచ్చు. పాత పద్ధతిలో ఫారాలను నింపాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా భవిష్యత్తులో ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేలా సిస్టమ్ ఏర్పాటు చేశారు. యూపీఐ, ఏటీఎంలలో డబ్బును ఉపసంహరించుకోవడం కూడా ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.