పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా నిర్ణయిస్తారో తెలుసా.. ? ఇంధన ధరలు పెంపుకు కారణం ఏంటి..?
కొద్ది నెలల్లోనే ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు(fuel prices) రికార్డు స్థాయికి చేరాయి. దేశంలోని చాలా ప్రముఖ నగరాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటి పరుగులు పెడుతున్నాయి. పెట్రోలు(petrol), డీజిల్ (diesel)ధరలు వరుస పెంపుతో సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదురుకొంటున్నారు.
సాధారణంగా పెట్రోల్, డీజిల్ ఎందుకు చాలా ఖరీదైనవి అనే ప్రశ్న మీలో తలెత్తి ఉంటుంది..? అసలు వాటి ధరలు ఎలా నిర్ణయిస్తారు..? ఈ విషయం తెలియకపోతే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా నిర్ణయిస్తారో చూద్దాం...
పెట్రోలు, డీజిల్ ధరలు ఒకే దానిపై ఆధారపడవు. వాటి ధరలను నిర్ణయించేటప్పుడు ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకుంటారు. ప్రపంచ చమురు మార్కెట్ నుండి వాటి ధరలను నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దాని గురించి వివరంగా తెలుసుకుందాం -
భారతదేశ పెట్రోల్, డీజిల్ డిమాండ్లో 80% ప్రపంచ చమురు మార్కెట్ పై ఆధారపడుతుంది. ఈ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించడంలో ప్రపంచ మార్కెట్ అతిపెద్ద పాత్రను పోషిస్తుంది. అయితే ముడిచమురు ధర రోజురోజుకూ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలో చమురు ధరలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిర్ణయిస్తాయి.
చమురును శుద్ధి చేసిన తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధర ప్రకారం చమురు ధరను నిర్ణయిస్తాయి. మూడవ ప్రధాన పాత్ర ప్రభుత్వం పోషిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురుపై పలు రకాల పన్నులు విధిస్తున్నాయి.
ఇందులో రాష్ట్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకం, వ్యాట్ ఉన్నాయి. ఆ తర్వాత డీలర్ కమీషన్ కూడా కలుపుతారు. వీటన్నింటిని జోడించిన తర్వాత మార్కెట్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరను నిర్ణయిస్తారు. ప్రపంచంలోనే పెట్రోలు, డీజిల్ ధరలపై భారత్ అత్యధిక పన్ను విధిస్తుండటం గమనార్హం.
వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు భిన్నంగా ఉంటాయి?
వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు భిన్నంగా ఉంటాయి అనే ప్రశ్న మీలో చాలా మందికి తలెత్తి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్). ప్రతి రాష్ట్రం ప్రకారం స్వంతంగా వేర్వేరు వ్యాట్ ని విధిస్తుంది. ఈ కారణంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి.