- Home
- Business
- DA Hike: అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, దీని కోసం ఎంత డబ్బు అవసరమంటే..
DA Hike: అక్టోబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, దీని కోసం ఎంత డబ్బు అవసరమంటే..
దసరా వచ్చిందంటే డీఏ పెంపు (DA hike) కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతోంది. దీంతో ఉద్యోగుల మొత్తం జీతం పెరుగుతుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో తెలుసుకోండి.
14

Image Credit : stockPhoto
కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ప్రతి ఏడాది ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. తమ తదుపరి డీఏ పెంపు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పండుగ సీజన్కు ముందు ఈ ప్రకటన వస్తుంది. అక్టోబర్ 1 నుంచి డీఏ పెంపు అమల్లోకి వస్తుంది.
24
Image Credit : Google
మూడు శాతం పెంపు
ఈ ఏడాది మార్చిలో డీఏ పెంపు జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు 55 శాతం డీఏ పొందుతున్నారు. ఇప్పుడు మరో 3% అదనపు పెంపు జరగబోతోంది. ఉద్యోగులకు పండుగ వేళ ఇది ఆనందాన్ని కలిగిస్తుంది.
34
Image Credit : stockPhoto
ఎంత భారం పడుతుందో తెలుసా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు 58 శాతానికి పెరుగుతుంది. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా 8000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. ఇది పెద్ద మొత్తమే అయినా ఉద్యోగులకు ఈ మొత్తం చెల్లించక తప్పదు.
44
Image Credit : our own
ద్రవ్యోల్భణం పెరగడం వల్ల
ప్రతి ఏడాది ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా వారి జీవన వ్యయాన్ని బ్యాలెన్స్ చేయడానికి డీఏను పెంచుతారు. దీన్నే డియర్ నెస్ అలవెన్స్ అంటారు.
Latest Videos