MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కానుక, వారి డీఏ 58 శాతానికి పెంపు

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కానుక, వారి డీఏ 58 శాతానికి పెంపు

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఎప్పట్నించో ఎదురుచూస్తున్న డీఏ పెంపుపై క్లారిటీ వచ్చేసింది.  AICPI సూచీ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగబోతోంది. అంటే తాజాగా వారికి మూడు శాతం డీఏను పెంచారు. 

2 Min read
Haritha Chappa
Published : Sep 03 2025, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉద్యోగులకు పండుగ కానుక
Image Credit : Freepik

ఉద్యోగులకు పండుగ కానుక

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ కానుక వచ్చేసిందే. వారికి  డీఏ పెంపుపై ఉన్న సందేహాలపై క్లారిటీ వచ్చేసింది. ఏకంగా వారికి 3 శాతం పెంపు ఇస్తున్నట్టు తెలుస్తోంది.  తాజా AICPI సూచీ డేటా ప్రకారం, కేంద్ర ఉద్యోగుల డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతోంది. ఈ పెంపు జూలై 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. అంటే ఉద్యోగులకు ఎరియర్స్ రూపంలో కూడా డబ్బులు వస్తాయి.

25
కోటి మందికి లాభం
Image Credit : stockPhoto

కోటి మందికి లాభం

భారతదేశంలో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు.  ప్రతి దీపావళి లేదా దసరా పండుగ సీజన్‌లో డీఏ పెంపును ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ ప్రకటన కోసం ఉద్యోగులు, పింఛను దారులు ఎదురుచూస్తూ ఉంటారు. మూడు శాతం పెంపును ఇప్పుడు ప్రకటించడం వల్ల జీతంలో పెరుగుదల అధికంగానే ఉంటుంది. కాబట్టి ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే జీతాలు ఎక్కువ. ప్రతి ఏడాది డీఏ పెంపు వల్ల మరింతగా జీతాలు పెరుగుతూనే ఉంటాయి.

Related Articles

Related image1
DA for Employees: త్వరలో ఆ ఉద్యోగులందరికీ శుభవార్త, మూడు శాతం డీఏ పెంపును ప్రకటించే అవకాశం
Related image2
Telangana: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. డీఏ పెంచుతూ నిర్ణ‌యం
35
ఏడో వేతన సంఘం
Image Credit : Asianet News

ఏడో వేతన సంఘం

ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం మూడు శాతం పెంపుకు ఇప్పటికే కేబినెట్ ఒప్పుకుంది. ఈ పెంపుకు సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్‌లో జరిగే కేబినెట్ సమావేశంలో వచ్చే అవకాశం ఉంది.  ఈ పెంపు ఈ ఏడాది జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. కాబట్టి ఉద్యోగులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్  నెలల ఎరియర్స్ కూడా రాబోతున్నాయి.

45
ఎంత పెరుగుతుంది?
Image Credit : Asianet News

ఎంత పెరుగుతుంది?

మూడు శాతం డీఏ పెరిగిందనగానే ఎంత జీతం పెరుగుతుందని ఎంతో మంది లెక్కలే వేస్తారు. 18000 రూపాయల జీతం వచ్చే వ్యక్తికి నెలకు రూ.540 రూపాయలు పెరుగుతుంది. అదే ఏడాదికైతే 6,480 రూపాయలు వరకు పెరుగుతుంది. ఇక లక్షల్లో జీతాలు ఉన్న వారికి మరింత ఎక్కువగా డీఏ పెరుగుతుంది. తద్వారా వారి జీతం కూడా పెరుగుతుంది. 

55
పెన్షనర్లకు ప్రయోజనం
Image Credit : our own

పెన్షనర్లకు ప్రయోజనం

లెవెల్-1లో నెలకు  రూ.56,900 ప్రాథమిక జీతం ఉన్నవారికి నెలకు రూ.1,707 వరకు జీతం పెరుగుతుంది. అదే సంవత్సరానికి రూ.20,484 పెరుగుతుంది. మొత్తం మీద  3 శాతం డీఏ పెంపు అనేది ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved