- Home
- Business
- Crude oil Price: అలా జరిగితే..లీటర్ పెట్రోల్ రూ.400 దాటడం ఖాయం..JP Morgan సంచలన నివేదిక
Crude oil Price: అలా జరిగితే..లీటర్ పెట్రోల్ రూ.400 దాటడం ఖాయం..JP Morgan సంచలన నివేదిక
Crude oil Price: వాహనదారులకు ఇది పిడుగు లాంటి వార్తే, ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 దాటేసిందని గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో మరోవైపు క్రూడాయిల్ ధరలు ఊహకు సైతం అందని రీతిలో ఆకాశాన్ని తాకే అవకాశం ఉందనే వార్తలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరానికి గురి చేస్తున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ముడి చమురు బ్యారెల్కు రికార్డు స్థాయిలో గరిష్టంగా 380 డాలర్లు (రూ. 30 వేలు) చేరుకుంటుందని, అంటే ప్రస్తుత ధర కంటే మూడు రెట్లు ఎక్కువ. గ్లోబల్ అనలిస్ట్ JP మోర్గాన్ చేజ్ ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా, యూరప్ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యా ముడిచమురు ఉత్పత్తిని తగ్గించుకుంటే అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ హెచ్చరించింది.
ఉక్రెయిన్పై దాడికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవడానికి రష్యా చమురు గరిష్ట ధరను నిర్ణయించడానికి ఏడు దేశాలు కలిసి ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ, రష్యా ఆర్థిక స్థితిని బట్టి, రష్యా తన ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం కలిగించకుండా ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్ తగ్గించగలదు. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపదు, అయితే ఇది మిగతా ప్రపంచానికి ఇది ప్రమాద హెచ్చరికే.
నివేదిక ప్రకారం, ఒపెక్ దేశాలు గరిష్ట ధరను నిర్ణయించే ప్రయత్నం చేస్తే, రష్యా దానిని అంగీకరించే బదులు సరఫరాను తగ్గించే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇది పాశ్చాత్య దేశాలను మరింత దెబ్బతీస్తుంది. జెపి మోర్గాన్ ప్రకారం, ప్రపంచ చమురు మార్కెట్ను కఠినతరం చేసే విషయంలో పరిస్థితులు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి.
రష్యా ప్రతిరోజూ 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరాను తగ్గిస్తే, బెంచ్మార్క్ లండన్ క్రూడ్ ధర బ్యారెల్కు 190 డాలర్లు అంటే రూ. 15 వేలు వరకు పెరగవచ్చు. రష్యా ప్రతి రోజు 5 మిలియన్ బ్యారెల్స్ సరఫరాను తగ్గిస్తే, అప్పుడు ముడి చమురు ధరలు 380 డాలర్లు అంటే 30 వేల రూపాయల వరకూ తాకే ప్రమాదం ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్ ధర 100 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. అయితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 90 నుంచి 100 మధ్యలో ట్రేడవుతున్నాయి.
ఇక జేపీ మోర్గన్ నివేదిక హెచ్చరించినట్లుగా క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 380 డాలర్ల చొప్పున ట్రేడయితే మాత్రం, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఊహకు అందనంత రేంజులో పెరిగే అవకాశం ఉంది. అంటే లీటర్ పెట్రోల్ ధర దాదాపు రూ.400 తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే జేపీ మోర్గాన్ నివేదికకు పూర్తి భిన్నంగా, సిటీ గ్రూప్ నివేదిక విడుదల చేసింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో US బెంచ్మార్క్ ముడి చమురు రేటు బ్యారెల్కు 100 డాలర్ల దిగువకు దిగి వచ్చింది. ఆర్థిక మందగమనం కారణంగా పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ముడిచమురు ధర పతనం కనిపిస్తోంది. కాగా, ఈ ఏడాది చివరి నాటికి ముడి చమురు ధరలు బ్యారెల్కు 65 డాలర్లకు తగ్గవచ్చని విదేశీ బ్రోకరేజ్ సంస్థ సిటీ అంచనా వేసింది.
ఇప్పటికే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 99.29 డాలర్లకు పడిపోయింది. క్రూడాయిల్ ధరల పతనం ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది కూడా కొనసాగవచ్చని సిటీ గ్రూప్ పేర్కొంది. 2023 చివరి నాటికి ముడి చమురు ధర బ్యారెల్కు 45 డాలర్లకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సిటీ గ్రూప్ బ్రెంట్ క్రూడ్ ధరలు 2022లో బ్యారెల్కు సగటున 98 డాలర్లు, 2023లో బ్యారెల్ 75 డాలర్లకు తగ్గుతాయని అంచనా వేసింది.
కానీ 2023లో రష్యా క్రూడ్ ఎగుమతులు బలంగా ఉండవచ్చని సిటీ గ్రూప్ నివేదికను రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ డిమాండ్ మరింత బలహీనపడటం వల్ల చమురు నిల్వలు పెరుగుతాయని సిటీ పేర్కొంది. దీనివల్ల ధరలు మరింత బలహీనపడతాయి. రాబోయే రోజుల్లో ముడి చమురు ధర తగ్గితే, పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం లభించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా భారత్లో పెట్రోలు, డీజిల్ ధరలు నిర్ణయిస్తారు.