ఆ రెండు ప్రతీ ఒక్కరికి ప్రాథమిక హక్కులుగా మారాయి.. ఖతర్ సదస్సులో ఆర్ఐఎల్ చీఫ్ ముకేశ్ అంబానీ
దేశాల మధ్య, దేశాల్లో అంతర్గతంగా ప్రజల మధ్య డిజిటల్ విభజనను తగ్గించాలని బిలియనీర్ ముఖేష్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం కనెక్టివిటీ అండ్ కమ్యూనికేషన్స్ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాథమిక హక్కులుగా మారాయి.
ఖతార్ ఎకనామిక్ ఫోరంలో ముకేష్ అంబానీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి సమయంలో 4జి టెలికాం నెట్వర్క్ లేకుండా భారతదేశం ఎలా ఉండేదో ఊహించటం చాలా కష్టం అని అన్నారు.
" భూమిపై ఉన్న ప్రతి మానవుడి ప్రాథమిక హక్కులు ఆహారం, దుస్తులు, ఇల్లు లాగానే కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ వంటివి ప్రాథమికమైనవి. ," అని అన్నారు.
భారతదేశపు అతి పిన్న వయస్కుడైన అతిపెద్ద టెలికం ఆపరేటర్ అధినేత ముకేష్ అంబానీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి రావడానికి ముందు 'డిజిటల్ ఇండియా' కోసం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినందున నేడు ఎంతో ఉపయోగపడింది.
సెప్టెంబర్ 2016లో ప్రారంభించిన రిలయన్స్ జియో ఉచిత వాయిస్ కాల్స్, చౌక డేటాను అందించడం ద్వారా టెలికాం పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. భారతదేశంలో 1.18 బిలియన్ మొబైల్ ఫోన్లకు, 775 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులకు చౌకైన డేటాను అందిస్తోంది.
" ప్రధానమంత్రి నరేంద్రమోడి డిజిటల్ ఇండియా పిలుపుతో మా డిజిటల్ సేవల సంస్థ జియో 2018 నాటికి దేశం అంతటా 4జి నెట్వర్క్ను తీసుకొచ్చింది" అని అంబానీ అన్నారు.
ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయి. పిల్లలు ఇంటి నుండే ఆన్ లైన్ క్లాసెస్ నేర్చుకోవడానికి ఉద్యోగులు ఎక్కడి నుండైనా పని చేయడానికి సహాయపడింది.
ప్రపంచ సహకారం కేవలం వ్యాక్సిన్లకే పరిమితం కాలేదు. సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి దేశాలు ముందుకు వచ్చాయి.
కోవిడ్-19 సెకండ్ వేవ్ సంక్షోభ సమయంలో ఖతార్ స్నేహాన్ని మనం మరచిపోలేము. వాణిజ్యానికి మించి ప్రయాణీకుల విమానాలన్నింటినీ భారతదేశానికి ఔషధం, సామాగ్రిని పొందటానికి ఉపయోగించాము" అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్, ఫిజికల్ (వైద్యపరంగా భౌతికమైన మౌలిక సదుపాయాలు) మేళవింపు సర్వసాధారణం కాగలదని ఆయన పేర్కొన్నారు.