పెట్రోల్ ధరతో పాటు మరో ఇంధనం ధరల పెంపు..ఎంత పెరిగిందంటే ?
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటాయి. కరోనా కాలంలో చమురు ధర సాధారణ ప్రజలపై మరింత భారం పెంచింది . ఇప్పుడు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్జి), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్జి) ధరలు కూడా దేశ రాజధానిలో ఖరీదైనవిగా మారుతున్నాయి.
ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సిఎన్జి, పిఎన్జి ధరలను పెంచటంతో దేశ రాజధాని ఢీల్లీలో సిఎన్జి కొత్త ధరను కిలోకు రూ .43.40 కు చేరగా నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లలో సిఎన్జి ధర కిలోకు రూ .49.08 చేరింది.
ఢీల్లీలో డోమస్టిక్ వినియోగానికి ఉపయోగించే పిఎన్జి ధర ఇప్పుడు స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (ఎస్సిఎం) కు రూ .2966 కాగా నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లలో ఎస్సిఎంకి రూ .299.61 ఖర్చవుతుందని కంపెనీ తన వెబ్సైట్లో తెలిపింది.
ప్రత్యామ్నాయ ఇంధనాలపై
పెట్రోల్, డీజిల్ ధరల తార స్థాయికి చేరుతుండటంతో చాలా మంది వాహనదారులు క్లీనర్ ఆల్టర్నేటివ్ ఇంధనాలకు మారాలని ఆలోచిస్తున్నారు . నేడు సిఎన్జి ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ కన్నా చాలా చౌకగా ఉంది. 'ఢీల్లీలో పెట్రోల్-డీజిల్ ధరలను సవరించిన తరువాత సిఎన్జి ధర పెట్రోల్తో పోలిస్తే 68 శాతం, డీజిల్తో పోలిస్తే 50 శాతం ఆదా చేస్తుంది' అని ఐజిఎల్ ట్వీట్లో పేర్కొంది.
నేటి మీ నగరాల్లో తాజా సిఎన్జి & పిఎన్జి ధరలు -
సిఎన్జి
ఢీల్లీ- కిలోకు రూ .44.30
నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ - కిలోకు రూ .49.98
ముజఫర్ నగర్, షామ్లి - కిలోకు రూ .57.25
గురుగ్రామ్ - కిలోకు రూ .53.40
రేవారి - కిలోకు రూ .54.10
కర్నాల్ - కిలోకు రూ .51.38
కైతల్ - కిలోకు రూ .51.38
కాన్పూర్, హమీర్పూర్, ఫతేపూర్ - కిలోకు రూ .60.50
హైదరాబాద్ - కిలోకు- 64.92