MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Budget 2022: వేగమైన ఆర్థిక వృద్ధికి కావాల్సింది ఇవే.. కేంద్ర మంత్రికి ఆర్‌బి‌ఐ మాజీ గవర్నర్ సూచనలు..

Budget 2022: వేగమైన ఆర్థిక వృద్ధికి కావాల్సింది ఇవే.. కేంద్ర మంత్రికి ఆర్‌బి‌ఐ మాజీ గవర్నర్ సూచనలు..

దేశంలో కోవిడ్-19  కొత్త వేరియంట్ ఓమిక్రాన్ (omicron)వ్యాప్తి కొనసాగుతోంది. మరోవైపు ఈసారి కూడా దేశ కేంద్ర ఆర్ధిక బడ్జెట్ (union budget)ని కరోనా నీడలో సమర్పించనున్నారు. అయితే  ఎప్పటిలాగే 1 ఫిబ్రవరి 2022న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి మీకు తెలిసిందే.  

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jan 20 2022, 06:45 PM IST| Updated : Jan 25 2022, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దీనిని సంబంధించి మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ రఘురామ్ రాజన్  ఆర్థిక వృద్ధికి కావల్సిన ముఖ్యమైన సూచనలను ఆర్థిక మంత్రికి ఇచ్చారు. అయితే వృద్ధిరేటు విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  

25

ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే చేదు మందు అవసరం
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చేదు ఔషధం అందించాల్సిన అవసరం ఉందని రఘురామ్ రాజన్ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో అతను దేశీయ ఆర్థిక వ్యవస్థ  పరిస్థితి, దిశ గురించి మాట్లాడారు. ఇంక్రిమెంటరీ బడ్జెట్‌ విధానాన్ని అనుసరించడం మానుకోవాలని ఆయన అన్నారు. అంటే ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలు. తయారీ, వ్యవసాయం వంటి రంగాల గురించి మాత్రమే చింతించాలనే ఆలోచనను కూడా మార్చుకోవాలని అన్నారు. 

35

కరోనా సవాళ్లను ఎదుర్కోవడానికి  
ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ స్థితిని బట్టి ఎక్కువ ఆశావాదం లేదా  నిరాశావాదం అవసరం లేదని తాను నమ్ముతున్నానని రాజన్ అన్నారు. ఈ సమయంలో సామాన్యులు నమ్మకాన్ని కోల్పోకుండా నిలబెట్టుకోవడం అత్యంత కీలకం. గత రెండు సంవత్సరాలుగా, కరోనా మహమ్మారి చీకటి నీడ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, ఇలాంటి పరిస్థితిలో దేశ ఆర్థిక వృద్ధిని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడం అతిపెద్ద సవాలు. ఈ సవాలును అధిగమించడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం మాత్రమే లేదని, దానిని ఎదుర్కోవటానికి సరైన మార్గాన్ని కనుగొనడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

45

పేలవమైన పనితీరు పథకాల ప్రచారం
ఎం‌ఎన్‌ఆర్‌ఈ‌జి‌ఏ (MNREGA)కోసం నిధులను పెంచడంపై ఉద్ఘాటిస్తూ మాజీ ఆర్‌బి‌ఐ గవర్నర్ ఆర్థిక వృద్ధి కోసం ఎం‌ఎన్‌ఆర్‌ఈ‌జి‌ఏతో సహా పేలవంగా పనిచేస్తున్న అన్ని రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. మనము టెలిమెడిసిన్, టెలి-లేయరింగ్ అండ్ ఎడ్యుటెక్ వంటి కొత్త రంగాలపై దృష్టి పెట్టాలి. వీటితో అనుబంధించిన పరిశ్రమకు నిధులు మాత్రమే కాదు, వాటికి మెరుగైన డేటా ప్రొటెక్షన్ నియమాలు కూడా అవసరం, అలాగే అవి ప్రపంచ ప్రమాణాలుగా ఉండాలి. ఇంకా కేవలం తయారీ, వ్యవసాయం గురించి ఆలోచించకుండా డిమాండ్‌ను పెంచే చర్యలపై దృష్టి సారించాలని అన్నారు. 

55

చిన్న చిన్న ఉద్యోగావకాశాలు  
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వలని అన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలిగినదంతా చేసేలా చూడటం ముఖ్యం. ఇలా చేయడం వల్ల ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమైన చిన్నపాటి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అంతే కాకుండా ఉక్కు, రాగి, సిమెంట్ వంటి వాటికి డిమాండ్ పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి ఊపునిస్తుంది అని అన్నారు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: రూ. 222తో రూ. 11 ల‌క్ష‌లు.. జ‌స్ట్ వ‌డ్డీ రూపంలోనే రూ. 3.8 ల‌క్ష‌లు పొందొచ్చు
Recommended image2
Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Recommended image3
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved