MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బడ్జెట్ 2022: ఈసారి విద్యా రంగంపై భారీగా ఆశలు.. కోతకు బదులు కేటాయింపులు పెరుగుతాయని అంచనా..

బడ్జెట్ 2022: ఈసారి విద్యా రంగంపై భారీగా ఆశలు.. కోతకు బదులు కేటాయింపులు పెరుగుతాయని అంచనా..

కేంద్ర బడ్జెట్‌(union budget)  ప్రకటనకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఎప్పటిలాగే  1 ఫిబ్రవరి 2022న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ(economy system)కు ఊపునిచ్చేలా బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 

1 Min read
Author : Ashok Kumar | Asianet News
| Updated : Jan 25 2022, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

 వివిధ రంగాలతో పాటు విద్యాశాఖ కూడా ఈసారి బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి బడ్జెట్ పెంచే అవకాశం ఉంది. 
 

గత బడ్జెట్‌లో 6 శాతం తగ్గింపు 
ఈసారి బడ్జెట్ 2022 నుండి విద్యారంగం చాలా ఆశలు పెట్టుకుంది. గత ఏడాది లాగానే విద్యా రంగానికి ఈసారి బడ్జెట్‌లో కోత పెట్టకుండా  ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. విశేషమేమిటంటే, గతేడాది వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన నిధులను 6 శాతం తగ్గించింది. ఈ కోత తర్వాత బడ్జెట్‌లో విద్యా రంగానికి మొత్తం రూ.93,223 కోట్లు కేటాయించారు. అంతకుముందు ఏడాది విద్యారంగానికి రూ.99,311 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు.

23

ఈ ఏడాది బడ్జెట్‌ను పెంచుతామని 
ఈ ఏడాది ప్రభుత్వం విద్యరంగంపై బడ్జెట్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. 2022-23 బడ్జెట్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఈ ఏడాది దాదాపు 10 శాతం కేటాయింపులను పెంచవచ్చని అంచనా. విశేషమేమిటంటే, గత సంవత్సరం చేసిన తగ్గింపు కరోనా మహమ్మారి సమయంలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా ఈ కోత ఆరోగ్య సంరక్షణ రంగానికి ఖర్చు చేయబడుతుందని తెలిపింది. ఈసారి కూడా దేశంలో బడ్జెట్‌ను కరోనా నీడలో సమర్పించబోతున్నారు, అయితే  విద్యా రంగం బడ్జెట్‌లో కోతకి బదులు  కేటాయింపు పెరుగుతుందని భావిస్తున్నారు. 
 

33

 బడ్జెట్ పై ఊహాగానాలు 
కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థపై, ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో  విద్యార్థులందరూ ప్రైవేట్ సంస్థలు అందించే విద్యా వనరులపై ఆధారపడటం పెరిగింది. ఇంకా వీటిని  విద్యా సేవల క్రింద వర్గీకరించబడ్డాయి అలాగే 18% గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST)ని ఆకర్షిస్తాయి. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఈ కేటగిరీకి సంబంధించిన జీఎస్టీ రేటును 5 శాతానికి సవరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved