MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • ఓలాకు బిగ్ షాక్.. దేశంలో ఎక్కువ మంది కోంటున్న బైకులు ఏవో తెలుసా?

ఓలాకు బిగ్ షాక్.. దేశంలో ఎక్కువ మంది కోంటున్న బైకులు ఏవో తెలుసా?

Shock to Ola Electric: దాని ఉత్పత్తుల నాణ్యత, విక్రయాల త‌ర్వాత అందించే సేవల విష‌యంలో పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు పెరగడం వంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ఓలా ఎలక్ట్రిక్ డిసెంబర్‌లో దాని మార్కెట్ వాటాను దాదాపు 19% కోల్పోయింది.  

Mahesh Rajamoni | Published : Jan 17 2025, 10:18 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

Shock to Ola Electric: భార‌త ఎలక్ట్రిక్ బైకుల మార్కెట్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి కొత్త‌ రికార్డుల‌తో ప్ర‌యాణం మొద‌లుపెట్టిన ఓలా ఎల‌క్ట్రిక్ కంపెనీకి బిగ్ షాక్ త‌గిలింది. తక్కువ కాలంలోనే దేశంలో ఎల‌క్ట్రిక్ బైకుల అమ్మ‌కాల్లో నెంబ‌ర్ స్థానాన్ని పొందిన ఈ కంపెనీ ఇప్పుడు తన ప్రభావాన్ని కోల్పోతోంది.

ఒక‌ప్పుడు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన (ఈ2డబ్ల్యూ) మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన ఓలా ఎలక్ట్రిక్ 2025 జనవరిలో వరుసగా రెండో నెల (డిసెంబర్) మూడో స్థానానికి పడిపోయింది. జనవరి 15 నాటికి వాహన్ డేటా ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ ఈ నెల మొదటి అర్ధభాగంలో 6,655 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. డిసెంబ‌ర్ లో ఎల‌క్ట్రిక్ బైకుల మార్కెట్ లో దాని వాటాను దాదాపు 19శాతం వ‌ర‌కు కోల్పోయింది.

26
Asianet Image

2025 ప్రారంభంలో 50 శాతం వాట‌ను క‌లిగిన ఓలా 

 

2024 ప్రారంభంలో దాదాపు 50–52% మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఓలా ఎలక్ట్రిక్ కు ఇప్పుడు భారీ క్షీణ‌త‌ను న‌మోదుచేసింది. 400,000 యూనిట్లకు పైగా విక్రయించింది. 2024 సంవత్సరానికి 35% వాటాను సాధించింది.

అయితే, ప్రస్తుత ఎల‌క్ట్రిక్ బైకుల విష‌యంలో ఓలా వాటాను  ఇత‌ర కంపెనీలు అందుకుంటున్నాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో ఈ విష‌యంలో ముందున్నాయి. టీవీఎస్ జనవరి మొదటి అర్ధభాగంలో 9,800 యూనిట్లను విక్రయించింది. ఇది 23% మార్కెట్ వాటాను పొందింది. బజాజ్ ఆటో 8,694 యూనిట్ల విక్ర‌యంతో 25% వాటాతో తరువాతి స్థానంలో ఉంది.

36
Asianet Image

ఎల‌క్ట్రిక్ బైకులు.. టీవీఎస్, బజాజ్ దూకుడు

 

టీవీఎస్, బ‌జాజ్ ఈ రెండు కంపెనీలు ఇప్పుడు ఎల‌క్ట్రిక్ బైకుల విష‌యంలో దాదాపు 48% మార్కెట్ ను నియంత్రిస్తున్నాయి. ఇది 2024 డిసెంబర్ లో వారి పనితీరుకు అనుగుణంగా ఉంది. ఇక్కడ బజాజ్ ఆటో, టీవీఎస్ వరుసగా 17,431 - 16,301 యూనిట్లను విక్రయించాయి. 

వీటి త‌ర్వాత ఏథర్ ఎనర్జీ కూడా పుంజుకుని జనవరి ప్రథమార్థంలో 5,360 యూనిట్లను విక్రయించింది. డిసెంబర్ లో 13.6 శాతంగా ఉన్న మార్కెట్ వాటా స్వల్పంగా పెరిగి 14.2 శాతానికి చేరింది. జనవరిలో కొంత భాగం, అథర్, ఓలా దగ్గరి పోటీలో ఉన్నాయి.

46
chetak electric

chetak electric

మార్కెట్ వాట‌ను కాపాడుకోవ‌డానికి డిస్కౌంట్ల‌తో ముందుకొచ్చిన ఓలా 

 

క్షీణిస్తున్న మార్కెట్ వాటాను పరిష్కరించడానికి ఓలా ఎలక్ట్రిక్ జనవరి 12, 14 మధ్య 72 గంటల డిస్కౌంట్ ప్రచారాన్ని తీసుకువ‌చ్చింది. తన ఎస్ 1 స్కూటర్ ను దాని అస‌లు ధ‌ర కంటే రూ .24,000 తక్కువగా, అలాగే, బ్యాటరీ వారంటీని పెంచుతూ అందిస్తోంది. ఏదేమైనా, ఓలా తన పోటీ అంచును నిలుపుకోవడంలో ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్ల దృష్ట్యా, ఈ చర్యల ప్రభావం అనిశ్చితంగా ఉంది.

కాగా, ఓలా ఎలక్ట్రిక్ కూడా రెగ్యులేటరీ పరిశీలనలో ఉంది. సర్వీస్ లోపాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి 10,000కు పైగా వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) కంపెనీపై దర్యాప్తు చేస్తోంది.

56
Asianet Image

హైకోర్టుకు చేరిన ఓలా కేసులు 

 

కర్ణాటక హైకోర్టు ఇటీవల ఓలా పై కేసుల‌  దర్యాప్తు చట్టబద్ధతను ధృవీకరించింది, డాక్యుమెంట్ అభ్యర్థనలను పాటించాలని ఓలాను ఆదేశించింది. అలాంటి కమ్యూనికేషన్ జారీ చేసే అధికారం దర్యాప్తు అధికారి పరిధిలోనే ఉందనీ, పిటిషనర్ అడిగిన అదనపు డాక్యుమెంట్లు, రికార్డులను సమర్పించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

ఈ సవాళ్లకు ప్రతిస్పందనగా, ఓలా తన రిటైల్, సర్వీస్ నెట్వర్క్ ను విస్తరించడంపై దృష్టి పెట్టింది. డిసెంబర్ 2024 నుండి, కంపెనీ 3,200 కొత్త అవుట్లెట్లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మొత్తం 4,000 ప్రదేశాలకు చేరుకుంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఔట్ లెట్లు వ్యూహాత్మకంగా సేవా కేంద్రాలతో కలిసి పనిచేస్తున్నాయి.

66
OLA gig

OLA gig

మార్కెట్ లీడర్ కూర్చిని నిలుపుకుంటుందా?

 

భారత ఎలక్ట్రిక్ బైకుల రంగంలో తక్కువ కాలంలోనే ఓలా మార్కెట్ లీడర్ గా ఎదిగింది. అయితే, ఇప్పుడు ఆ సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. టీవీఎస్, బజాజ్, ఏథర్ లు మార్కెట్ లో విస్తారిస్తున్నాయి. ప్రస్తుత సవాళ్లను అధిగమించి ఓలా మార్కెట్ లీడర్ కూర్చిని నిలుపుకుంటుందా?  లేక పడిపోతుందా? అనే చర్చ మొదలైంది. 

ఓలా ఎలక్ట్రిక్ 2024 లో 52% వార్షిక వృద్ధితో మార్కెట్ లీడర్ గా ఉండగా, టీవీఎస్, బజాజ్ ఆటో వేగంగా తమ కార్యకలాపాలను పెంచుకుంటున్నాయి. 2024లో టీవీఎస్ 2.2 లక్షల యూనిట్లు, బజాజ్ 1.93 లక్షల యూనిట్లను విక్రయించడంతో ఓలా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఈ రెండు కంపెనీలు ముందుకు సాగుతున్నాయి.

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
 
Recommended Stories
Top Stories