MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇలా చేస్తే UPI మోసాలకు అడ్డుకట్ట పడినట్టే

ఇలా చేస్తే UPI మోసాలకు అడ్డుకట్ట పడినట్టే

UPI మోసాలు ఎంతలా పెరిగిపోతున్నాయో చూస్తున్నాం కదా.. అందుకే అలాంటి మోసాల నుంచి వినియోగదారులను రక్షించడానికి భారత్ పే షీల్డ్ అనే కొత్త సర్వీసును ప్రారంభించింది. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి.  

2 Min read
Naga Surya Phani Kumar
Published : Dec 21 2024, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆన్‌లైన్ మోసాలు ఎంతలా పెరిగిపోతున్నాయంటే మనకు తెలియకుండా మన అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. ఓటీపీలు తెలుసుకొని, పిన్ నెంబర్లు కాపీ చేసి, ఈ మధ్య స్కానర్ ద్వారా కూడా అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. అందుకే భారత్ పే తన వినియోగదారులను UPI మోసాల నుంచి రక్షించడానికి షీల్డ్ అనే కొత్త సర్వీస్ ను ఇటీవలే ప్రారంభించింది. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నందున సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. 

 

25

షీల్డ్ అనేది ఒక సేఫ్టీ ప్లానింగ్ టాస్క్. ఇది వినియోగదారులను మోసాల నుంచి కాపాడుతుంది. ఫిషింగ్ ప్రయత్నాలు, అనధికారిక లావాదేవీల నుండి రక్షిస్తుంది. వినియోగదారులు తమ ఫోన్‌ను పోగొట్టుకున్నప్పటికీ అందులో ఉండే డాటా ద్వారా మోసపోకుండా కాపాడుతుంది. 

వినియోగదారులు మొదటి 30 రోజులు ఈ సర్వీసును ఉచితంగా పొందవచ్చు. ట్రయల్ పీరియడ్ తర్వాత నెలకు కేవలం రూ.19 పే చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ వల్ల మీరెప్పుడైనా ఆన్ లైన్ మోసానికి గురైతే రూ.5,000 వరకు కవరేజీని అందిస్తుంది.

35

షీల్డ్ సర్వీస్ భారత్ పే యాప్‌లో అందుబాటులో ఉంది. దీన్ని Android, iOS పరికరాల్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సంబంధిత బ్యానర్‌పై క్లిక్ చేయడం ద్వారా యాప్ హోమ్ పేజీ నుండి నేరుగా షీల్డ్‌ను యాక్టివేట్ చేయవచ్చు. 

ఈ షీల్డ్ సర్వీస్ ఆన్ లైన్ మోసాలను అడ్డుకుంటుంది. ఒకవేళ వినియోగదారుడు మోసానికి గురైనట్లయితే క్లెయిమ్‌ను నేరుగా ఫైల్ చేయవచ్చు. OneAssist యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దాని ద్వారా కంప్లయింట్ చేయవచ్చు. లేదా వారి టోల్ ఫ్రీ నంబర్ 1800-123-3330కి కాల్ చేసి జరిగిన మోసం గురించి రిపోర్ట్ చేయవచ్చు.

45

అయితే వినియోగదారులు మోసం జరిగిన 10 రోజులలోపు రిపోర్ట్ చేయాలి. పరిస్థితిని బట్టి UPI లావాదేవీ స్టేట్‌మెంట్, పోలీస్ రిపోర్ట్ కాపీ, FIR, క్లెయిమ్ ఫారమ్, UPI అకౌంట్ బ్లాక్ చేసినట్లు రుజువు వంటి కొన్ని డాక్యుమెంట్‌లను సమర్పించాల్సి ఉంటుంది.  ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు ప్రతి ఒక్కరికీ అత్యవసరంగా మారిపోయాయి. అందువల్ల షీల్డ్ వంటి చర్యలు భద్రతను కలిగిస్తాయి.

 

55

భారత్ పే షీల్డ్ డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా మారుస్తుంది. కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయడం నుండి బిల్లుల చెల్లింపుల వరకు ప్రతిదానికీ UPI యాప్‌లను ఉపయోగించే వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నందున షీల్డ్ వంటి రక్షణ కల్పించే సౌకర్యాలను ఉపయోగించుకోవడం మేలు. ఇది ప్రమాదాన్ని పూర్తిగా తొలగించకపోయినా డిజిటల్ లావాదేవీలను అందరికీ సురక్షితంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. వినియోగదారులు కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తెలియని లింక్‌లను క్లిక్ చేయడం, అనవసర యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, అపరిచితులతో ముఖ్యమైన చెల్లింపు సమాచారాన్ని షేర్ చేయడం మానుకొంటే మోసాలు జరగకుండా ఉంటాయి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved