పెగాసస్ స్పైవేర్ కేసులో కొత్త ట్విస్ట్ : అనిల్ అంబానీ, దుబాయ్ యువరాణి.., దలైలామా..తో సహ మరికొందరి పేర్లు..
భారతదేశంలో పెగసాస్ స్పైవేర్ కుంభకోణంలో ప్రతిపక్షాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో ధ్వజమేత్తయి.
పెగసాస్ స్పైవేర్ కుంభకోణం కేసు నివేదికలో మరికొన్ని కొత్త పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయి. ఇందులో భరతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఫోన్ కూడా హ్యాక్ గురైనట్లు చెబుతున్నారు. అంతేకాకుండా మాజీ సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ ఫోన్ కూడా ట్యాపింగ్ గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పెగసాస్ ప్రాజెక్ట్ గ్రూప్ మీడియా పార్ట్నర్స్ విశ్లేషించిన నవంబర్ జాబితాలో అనిల్ అంబానీ, రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ADAG) అఫిషియల్స్ ఉపయోగించిన ఫోన్ నంబర్లను కూడా చేర్చారని ఒక నివేదిక పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఆ ఫోన్ నంబర్లను అనిల్ అంబానీ ఉపయోగిస్తున్నారా లేదా అని నివేదికలో నిర్ధారించలేదు. ప్రస్తుతం దీని గురించి స్పష్టమైన సమాచారం లేనప్పటికి అనిల్ అంబానీతో పాటు ఫోన్ నంబర్ల జాబితాలో ఇతర కంపెనీ ఎగ్జిక్యూటివ్లలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ టోనీ జెసుదాసన్, అతని భార్య పేరు కూడా ఉన్నాట్లు తెలుస్తుంది.
టిబెటన్ మత గురువు దలైలామా సలహాదారులు, నాగలీమ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ (ఎన్ఎస్సిఎన్ ) పలువురు నాయకుల పేర్లు కూడా పెగసాస్ స్పైవేర్ బాధితుల జాబితాలో చేర్చారు. అంతేకాకుండా, దుబాయ్ యువరాణి షేక్ లతీఫాకు చాలా మంది దగ్గరి బంధువులపై పెగసాస్ స్పైవేర్ గూఢచర్యం చేసే అవకాశం కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గార్డియన్లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, భారతదేశంలో ప్రవాసంలో ఉన్న ప్రభుత్వాల అధిపతుల పేర్లు, మరొక ఆధ్యాత్మిక మేధో నాయకుడి సిబ్బంది అయిన లోబ్సాంగ్ సంగే, గయాల్వాంగ్ కర్మపాలను కూడా ఎన్ఎస్ఓ గ్రూప్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది.
దలైలామా సలహాదారులలో టెంపా సెరింగ్ కూడా ఉన్నారు. అతను చాలాకాలంగా దలైలామా రాయబారిగా ఢీల్లీలో ఉంటున్నారు. అంతేకాకుండా టెంజిన్ తఖ్లా, చిమీ రిగ్గెన్ అండ్ సెమ్డాంగ్ రిన్పోచే పేర్లు కూడా ఉన్నాయి. మరో నివేదికలో ఎన్ఎస్సిఎన్ లీడర్స్ ఇసేక్ మువా, అటెమ్ వాషుమ్, అపామ్ మువా, ఆంథోనీ షిమ్రే, ఫంటింగ్ షిమ్రాంగ్ కూడా ఉన్నారు. నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్స్ (ఎన్ఎన్పిజి) కన్వీనర్ ఎన్ కిటోవి జిమోమి పేరు కూడా ఉంది. 2017 చివరలో నాగ సమస్యకు పరిష్కారం కోసం మోడీ ప్రభుత్వం జిమోమితో చర్చలు జరుపుతోంది.
జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ అసమ్మతివాదులతో సహా 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్లను పెగసాస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి హ్యాక్ చేసినట్లు భారతదేశంలో ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ ఆరోపణలు ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిజెపి మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫోన్ నంబర్లు ఇజ్రాయెల్ స్పైవేర్ ద్వారా హ్యాకింగ్ చేసినట్లు జాబితా చేశారు.